AUKUS సబ్మెరైన్ ఒప్పందం.. భగ్గుమన్న డ్రాగన్
ఆకస్(AUKUS) కూటమి ప్రకటించిన సబ్మెరైన్ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని మండిపడింది.
బీజింగ్: అమెరికా(America)కు చెందిన ఐదు అణు జలాంతర్గాముల(nuclear-powered submarines) కొనుగోలు ప్రణాళికలను తాజాగా ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు ఏర్పడిన ఆకస్(AUKUS)లోని ఈ దేశం చేసిన ప్రకటనపై డ్రాగన్ భగ్గుమంటోంది. ఆ కూటమి దేశాలు తప్పుడు, ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తున్నాయని మండిపడింది.
అమెరికాAmerica), ఆస్ట్రేలియా(Australia), బ్రిటన్(United Kingdom) కలిసి ఆకస్(AUKUS) పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. 18 నెలల క్రితం ఈ కూటమి ఏర్పడింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. ఈ క్రమంలోనే అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో అమెరికా, బ్రిటన్ దేశాలు ఆస్ట్రేలియాకు సాయం అందిస్తాయి. ఈ క్రమంలో ఆకస్ సబ్మరైన్ డీల్ను ఆవిష్కరించారు.
దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. ‘తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్.. అంతర్జాతీయంగా వస్తోన్న ఆందోళనలను పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. వారు కేవలం వారి భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. వారు ప్రమాదకరమైన, తప్పుడు మార్గంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వానికి నిదర్శమని తెలిపారు. అలాగే ఈ విక్రయం అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతమని వ్యాఖ్యానించారు.
యూఎస్(US)కు చెందిన ఐదు అణు జలాంతర్గాములను కొనుగోలు చేస్తామని, తర్వాత యూఎస్, బ్రిటిష్ సాంకేతికతతో కొత్త మోడల్ను నిర్మిస్తామని ఈ ఒప్పందం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు