Australia: సందర్శకులకూ ఆస్ట్రేలియా అనుమతి.. 21 నుంచి ఆంక్షల సడలింపు
ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. ఈ మేరకు సోమవారం...
కాన్బెర్రా: ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆస్ట్రేలియా.. 2020 మార్చి నుంచి అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. స్థానికంగా వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో.. గతేడాది నవంబర్లో సరిహద్దు ఆంక్షలను కాస్త సడలించింది. అయితే, ఆ సమయంలో అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చింది.
తాజాగా.. ఫిబ్రవరి 21 నుంచి టీకాలు పూర్తయిన వీసా హోల్డర్లందరూ తమ దేశానికి రావొచ్చని ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రకటించారు. సందర్శకులందరూ తప్పనిసరిగా టీకా ఆధారాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీకాకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ను ఆస్ట్రేలియా నుంచి పంపించివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, టీకా ఎందుకు వేయించుకోలేదో వైద్యపరమైన కారణాలు చూపగలిగే వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. మహమ్మారి పరిణామాలతో దాదాపు రెండేళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉన్న పర్యాటక రంగానికి తాజా నిర్ణయంతో ఉపశమనం కలిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..