WFH: ‘వర్క్ఫ్రమ్ హోం’పై కుబేరుల కొట్లాట..!
‘కార్యాలయానికి వచ్చి పనిచేయండి.. లేదంటే సంస్థను వీడిపోండి’ అంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా సంపన్నుడి నుంచి ప్రతిస్పందన ఎదురయ్యింది.
ఎలాన్ మస్క్ హెచ్చరికపై ఆస్ట్రేలియా సంపన్నుడి స్పందన
ఇంటర్నెట్ డెస్క్: ఇక నుంచి తమ సంస్థ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం లేదని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఘాటు హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. ‘కార్యాలయానికి వచ్చి పనిచేయండి.. లేదంటే సంస్థను వీడిపోండి’ అంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా సంపన్నుడి నుంచి ప్రతిస్పందన ఎదురయ్యింది. ఎక్కడ నుంచైనా పనిచేసే సౌలభ్యాన్ని తమ సంస్థ కల్పిస్తోందన్న ఆయన.. టెస్లా ఉద్యోగులకు ఆసక్తి ఉందా.? అంటూ ఆఫర్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. ఆర్థిక మాంద్యం వల్ల కీలకమైన ప్రక్షాళన చర్యలు ఎందుకు చేపట్టాలో మీ వరుస ట్వీట్లు వివరిస్తున్నాయంటూ బదులిచ్చారు.
‘టెస్లా ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆఫీస్ నుంచే పనిచేయాలి. ఇందుకు సిద్ధంగా లేనివారిని రాజీనామా చేసినట్లుగా భావిస్తాం’ అంటూ టెస్లా ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే, దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనే మూడో సంపన్నుడు, అట్లాసియన్ సాఫ్ట్వేర్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు స్కాట్ ఫర్కుహర్ స్పందించారు. మస్క్ తీసుకున్న నిర్ణయం 1950కాలం నాటి మాదిరిగా కనిపిస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎక్కడనుంచైనా పనిచేసే విధానమే తమ సంస్థ ఎదుగుదలకు దోహదపడుతుందంటూ వరుస ట్వీట్లు చేశారు. 2026 ఆర్థిక సంవత్సరానికి 25వేల మంది ఉద్యోగులను కలిగివుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఎవరైనా టెస్లా ఉద్యోగులకు ఆసక్తి ఉందా..? అంటూ ప్రశ్నించారు.
ఆస్ట్రేలియా సంపన్నుడి స్పందనకు ఎలాన్ మస్క్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. పైన పేర్కొన్న వరుస ట్వీట్లు.. ఆర్థిక మాంద్యం వల్ల కీలకమైన ప్రక్షాళన చర్యలు ఎందుకు చేపట్టాలో మీ వరుస ట్వీట్లు వివరిస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే, సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో తరచుగా స్పందించే ఎలాన్ మస్క్.. సున్నిత విషయాలపైనా తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తుంటారు. ఇక రానున్న రోజుల్లో ఆర్థికవ్యవస్థకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తమ సంస్థలో ఉద్యోగ నియామకాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని తొలగించాల్సిన అవసరం కూడా ఉందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)