Japan: పసిబిడ్డల్ని ఏడిపించి.. వేడుక చేసుకున్నారు..!
జపాన్ వాసులు ఈ రోజు వింత సంప్రదాయాన్ని నిర్వహించారు. తమ పిల్లల్ని బాగా ఏడిపించారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
టోక్యో: శనివారం జపాన్(Japan ) ప్రజలు తమ పసిబిడ్డలను ఏడిపించారు..! తమ బిడ్డ మొదటగా, బిగ్గరగా ఏడ్వాలని ప్రతి తల్లీతండ్రి కోరుకున్నారు..! ఇదేం విడ్డూరమని ఆ కుటుంబాలపై కోపం వస్తుందా..? కానీ జపాన్లో ఇది శతాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయమని తెలుసా మరి..! (Crying Sumo Festival)
కరోనాతో కొన్నేళ్లుగా ఆగిన ఈ సంప్రదాయాన్ని శనివారం జపాన్(Japan ) వ్యాప్తంగా పలు ఆలయాల్లో నిర్వహించారు. దీని ప్రకారం.. చిన్నారులకు సుమో ఆప్రాన్స్ వేస్తారు. ఇద్దరు ఇద్దరిగా ఆ పిల్లల్ని సుమో రింగ్లోకి తీసుకెళ్లి సుమోలకు ఇస్తారు. వారు చిన్నారులను ఎత్తిపట్టి ఇద్దరు ఢీ కొన్నట్టుగా పోటీ పెడతారు. ఈ ప్రక్రియలో ఎవరు ముందుగా ఏడుస్తారో వారే గెలిచినట్టు. ఒక్కోసారి ఒకవైపు ఉన్నవారు ఏడ్చినా.. మరోవైపు సుమో చేతిలో ఉన్నవారి కంటిలో చుక్కనీరు రాదు. అప్పుడు భయపెట్టే ఆకృతిలో ఉన్న డెమన్ మాస్కులు ధరించి వారిని ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ‘పిల్లలు ఏడుపు శబ్దాన్ని బట్టి వారి ఆరోగ్యాన్ని మేం అంచనా వేస్తాం. ఈ రోజు నా బిడ్డ కంగారు పడి, అంతగా ఏడ్వకపోవచ్చు. కానీ ఏడుపు ద్వారా ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా’ అని ఎనిమిది నెలల పాప తల్లి ఒకరు వెల్లడించారు.
ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించిన అసకుసా టూరిజం ఫెడరేషన్ ఛైర్మన్ షిగెమీ ఫుజీ మాట్లాడుతూ.. ‘పిల్లల్ని ఏడిపించడం కొందరు ఒక భయంకరమైన చర్యగా చూస్తారు. కానీ పిల్లలు ఎవరు గట్టిగా ఏడుస్తారో.. వారు ఆరోగ్యంగా ఎదుగుతారని మా నమ్మకం. జపాన్(Japan)లో చాలా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం(Crying Sumo Festival) కొనసాగుతోంది. ఈ రోజు మేం నిర్వహించిన కార్యక్రమంలో 64 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంప్రదాయంలో పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొదట ఏడ్చిన బిడ్డ గెలిచినట్టు భావిస్తారు. మరికొన్ని చోట్ల దానిని ఓటమిగా చూస్తారు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్