Bakhmut: గులాబీల నగరం.. నెత్తుటి దారుల్లో మునిగిన వేళ..!
పారిశ్రామిక నగరంగా పేరున్న బఖ్ముత్ (Bakhmut) నగరం.. గులాబీల నగరంగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలంగా రష్యా దురాక్రమణకు (Russia Invasion) కేంద్ర బిందువుగా మారిన ఈ నగరం ఇప్పుడు పూర్తిగా నాశనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చేస్తున్న దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్ నగరాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ (Ukraine) బలగాలు మాత్రం రష్యా సేనలను నిలువరిస్తూ తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా పైచేయి సాధించినట్లు రష్యా చెప్పుకుంటోన్న బఖ్ముత్లో (Bakhmut) పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు గులాబీల నగరంగా పేరొందిన ఆ ప్రాంతం ఇప్పుడు భూమి మీద ఉన్న ఓ నరక కూపంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్లో యుద్ధం మొదలుకాక ముందు బఖ్ముత్ (Bakhmut) నగరం జనాభా సుమారు లక్ష మాత్రమే. దొనెత్స్క్ ప్రాంతంలో ఉన్న బఖ్ముత్కా నది ఈ నగరం మీదుగా ప్రవహిస్తుంది. అయితే, ఇది లోయప్రాంతంలో ఉండటం వల్ల శత్రుదేశాలను ఎదుర్కోవడం ఇక్కడ కష్టం. ఒకప్పుడు ఉప్పు తవ్వకాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం రైల్వే హబ్గా ఉంది. నాణ్యమైన వైన్ తయారీకి ఈ నగరం ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం అదంతా ఒడెసా ప్రాంతానికి తరలిపోయింది. 1924 నుంచి 2016 వరకు ఈ ప్రాంతాన్ని అర్టెమొవస్క్గా పిలిచారు. సోవియట్ విప్లవకారుడికి నివాళిగా దీన్ని ‘ఆర్టెమ్’ అని పిలిచేవారు. అప్పట్లో దీన్ని వైన్, గులాబీల నగరంగా పిలిచేవారు. నగరంలోని ఓ వీధిలో రికార్డుస్థాయిలో దాదాపు 5వేల గులాబీ మొక్కలు ఉండేవట. దాంతో ఆ ప్రాంతం.. గులాబీల వీధి అని ప్రసిద్ధి చెందింది.
అంతా శిథిలమై..
పారిశ్రామిక నగరంగా పేరున్న ఈ గులాబీల నగరం కొంతకాలంగా రష్యా దురాక్రమణకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్చి నాటికి అక్కడ 3వేల మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు స్థానిక అధికారుల అంచనా. సుమారు ఎనిమిది నెలలుగా జరుగుతోన్న భీకర దాడులతో నగరం ప్రస్తుతం పూర్తిగా నాశనమయ్యింది. ఎక్కడ చూసినా శిథిల భవంతులే. ఫిరంగుల మధ్య కుప్పకూలిన నిర్మాణాలు, పౌరుల సమాధులతో నిండిపోయిన ప్రాంతంగా దర్శనమిస్తుంది. పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు ఒకేఒక్క రహదారి ఉందని.. దానికి ఉక్రెయిన్ సైనికులు ‘జీవ రహదారి’ (Road of Life) అని పేరుపెట్టుకున్నారు.
రష్యా సేనలు, వారి ప్రైవేటు సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సేనలు అక్కడ 220 రోజులుగా వీరోచిత పోరాటం చేస్తున్నాయి. ఈ భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా. ఇటు ఉక్రెయిన్ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టం చవిచూసింది. ఇలా రష్యా సైన్యం చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సైనికులు.. ఈ యుద్ధక్షేత్రాన్ని భూమ్మిదే అత్యంత నరకమైన ప్రదేశంగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో సుదీర్ఘకాలం పాటు పోరు కొనసాగడంతోపాటు సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయిన ఫ్రాన్స్లోని ‘వెర్డన్’తో పోల్చిచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్