Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
అవసరం అనుకుంటే భారత్ (India) తమ దేశంలోని చట్టోగ్రామ్ (Chattogram), షిల్హెట్ (Sylhet) పోర్టులను వినియోగించుకోవచ్చని బంగ్లాదేశ్ ఆఫర్ చేసినట్లు అక్కడి వార్తా పత్రిక పేర్కొంది.
ఢాకా: భారత్ (India)తో సత్సంబంధాల నేపథ్యంలో పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh) ఆఫర్ ఇచ్చింది. అవసరమైతే తమ దేశంలోని చట్టోగ్రామ్ (Chattogram), సిల్హెట్ (Sylhet) పోర్టులను భారత్ వినియోగించుకోవచ్చని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ మేరకు ఢాకా ట్రైబ్యూన్ వార్తా పత్రిక వెల్లడించింది. విదేశాల మధ్య వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ అనుసంధానాన్ని వృద్ధి చేసేందుకే బంగ్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్లోని పోర్టుల్లో చట్టోగ్రామ్ ప్రధానమైనది. భౌగోళికంగా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు అతి సమీపంలో ఉంటుంది. ఈ పోర్టును భారత్ వినియోగించుకోవడం వల్ల సరకు రవాణా లాభదాయకంగా ఉంటుంది. అలాగే సిల్హెట్పోర్టు వల్ల కూడా భారత్కు ప్రయోజనం కలిగే వీలుంది.
ఇండియా ఫౌండేషన్ సభ్యుడు రామ్మాధవ్తో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆదివారం ఆమె అధికారిక నివాసం గానాభబన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హసీనా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఢాకా ట్రైబ్యూన్ తాజాగా వెల్లడించింది. ‘బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్, సిల్హెట్ పోర్టులను అవసరం అనుకుంటే భారత్ ఉపయోగించుకోవచ్చు’ అని రామ్మాధవ్తో ఆమె చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీనివల్ల ఇరుదేశాల మధ్య ప్రాంతీయ అనుసంధానత మెరుగుపడుతుందని హసీనా అభిప్రాయపడినట్లు తెలిపింది. మరోవైపు షేక్హసీనా నేతృత్వంలో బంగ్లాదేశ్ ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిబాటలో పయనించడాన్ని రామ్మాధవ్ అభినందించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, భవిష్యత్లోనూ ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టోగ్రామ్ పోర్టును గతంలో చిట్టగాంగ్ అని పిలిచేవారు. బంగ్లాదేశ్కు అగ్నేయతీరంలో ఉంది. మరో పోర్టు సిల్హెట్ను గతంలో సూఫీగా పిలిచే వారు. ఇది తూర్పు బంగ్లాదేశ్లోని సుర్మా నదిపై ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.