Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాల తీయగా.. పాకిస్థాన్ దివాల అంచుకు చేరింది. ఇటీవల మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్ఔట్
విదేశీ మారకద్రవ్యం కోసం తీవ్ర యత్నాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. పాకిస్థాన్ దివాలా అంచుకు చేరింది. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్ఔట్ ప్యాకేజీ కోసం వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్ పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో లభించే రుణాలను అవసరాలకు వాడుకోవడానికి ఓ మార్గంగా వాడుకొంటున్నట్టు సమర్థించుకొంది. కానీ, వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
అనుమానాలు దేనికి..
బంగ్లాదేశ్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 416 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 33వ స్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం, సర్వీస్ సెక్టార్లపై ఆధారపడి ఉంది. జీడీపీలో 56శాతం ఉన్న దేశ సర్వీస్ సెక్టార్ కొవిడ్ కారణంగా బాగా దెబ్బతింది. దీంతో 11లక్షల మంది నిరుద్యోగులయ్యారు.
* మరో వైపు బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 84శాతం వాటా ఉన్న రెడీమేడ్ దుస్తుల డిమాండ్ కూడా కొవిడ్ లాక్డౌన్ల కారణంగా దెబ్బతింది. ఆర్డర్లు లభించకపోవడం, రద్దు కావడం, చెల్లింపుల్లో ఆలస్యాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
* విదేశాల్లో నివసించే బంగ్లాదేశ్ వాసులు స్వదేశానికి పంపించే మొత్తాలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అత్యధికంగా విదేశాల నుంచి రెమిటెన్సెస్లు అందుకొనే దేశాల్లో బంగ్లాదేశ్ ఏడో అతిపెద్ద దేశం. 2020-21లో 24.77 బిలియన్ డాలర్లు అందుకోగా.. ఆ తర్వాతి ఏడాది 21.03 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.
* రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడం కూడా బంగ్లాదేశ్కు శాపంగా మారింది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు 33 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది చాలా ఎక్కువ. దీంతోపాటు దేశ రిజర్వు కరెన్సీ నిల్వలు 40 బిలియన్ డాలర్ల కంటే కిందకు చేరిపోయాయి. జులై27 నాటికి 39.48 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా బంగ్లాదేశ్ టకా విలువ మే నెలలో డాలర్కు 86 టకాలు ఉండగా.. ప్రస్తుతం సుమారు 94 టకాల వద్ద కొనసాగుతోంది. దీనికి అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు ఆజ్యం పోశాయి. డాలర్ డిమాండ్ గణనీయంగా పెరిగింది.
భారీగా పెరిగిన ఇంధన ధరలు..
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆగస్టు 5వ తేదీన ఇంధన ధరలను ఇటీవల పెంచారు. డీజిల్, కిరోసిన్ ధరల్లో 42.5శాతం, పెట్రోల్పై 51.1శాతం, ఆక్టేన్పై 51.7శాతం ధరను పెంచారు. ఫలితంగా డీజిల్ కిరోసిన్ 34 టకాలు పెరిగి 114 టకాలకు, పెట్రోల్ 86 టకాలు పెరిగి 130 టకాలకు, ఆక్టేన్ కూడా 89 టకాలు పెరిగి 135 టకాలకు చేరింది. దీంతో బంగ్లాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకొంటున్నాయి.
అప్పుల కోసం తీవ్ర యత్నాలు..
ఢాకా ఐఎంఎఫ్ వద్ద 4.5 బిలియన్ డాలర్ల రుణంతో పాటు పలు సంస్థల వద్ద అప్పుల కోసం యత్నిస్తోంది. ప్రపంచ బ్యాంక్ వద్ద బిలియన్ డాలర్ల రుణం కోసం యత్నాలు చేస్తోంది. వివిధ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల రుణం కోసం యత్నిస్తోంది. ఇక జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ నుంచి కూడా రుణం కోసం యత్నిస్తున్నట్లు అట్లాంటిక్ కౌన్సిల్ కథనంలో పేర్కొంది. ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పినా పలు చోట్ల నుంచి రుణాలను తీసుకుంది. 2020 జూన్ నాటికి 1.7 బిలియన్ డాలర్లు, 2021 అక్టోబర్ నాటికి మూడు బిలియన్ డాలర్లను రుణాలుగా తీసుకొంది. బడ్జెటరీ సపోర్ట్ కింద 2019-20, 2021-22ల్లో 5.8 బిలియన్ డాలర్ల రుణం స్వీకరించింది. దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి 1.4 బిలియన్ డాలర్లు, విదేశీ అప్పుల చెల్లింపుల కోసం ఐఎంఎఫ్ నుంచి 732 మిలియన్ డాలర్లు అప్పు చేసింది. కొవిడ్ మహమ్మారి తర్వాత అనుకున్నంత వేగంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదన్న విషయాన్ని ఇవి చెబుతున్నాయి.
* బంగ్లాదేశ్లో అంతర్గతంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఒక్క 2019లోనే 11.11 బిలియన్ డాలర్ల రుణాలు దేశీయంగా ఎగవేసినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ వెల్లడిస్తోంది. కానీ, ఐఎంఎఫ్ మాత్రం ఈ ఎగవేతల మొత్తం కనీసం రెట్టింపు ఉండొచ్చని చెబుతోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద ఉన్న రిజర్వులు కొన్ని నెలల విదేశీ చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీ రిజర్వులు పుంజుకోకపోతే ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య