Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాల తీయగా.. పాకిస్థాన్ దివాల అంచుకు చేరింది. ఇటీవల మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్ఔట్
విదేశీ మారకద్రవ్యం కోసం తీవ్ర యత్నాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. పాకిస్థాన్ దివాలా అంచుకు చేరింది. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్ఔట్ ప్యాకేజీ కోసం వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్ పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో లభించే రుణాలను అవసరాలకు వాడుకోవడానికి ఓ మార్గంగా వాడుకొంటున్నట్టు సమర్థించుకొంది. కానీ, వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
అనుమానాలు దేనికి..
బంగ్లాదేశ్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 416 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 33వ స్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం, సర్వీస్ సెక్టార్లపై ఆధారపడి ఉంది. జీడీపీలో 56శాతం ఉన్న దేశ సర్వీస్ సెక్టార్ కొవిడ్ కారణంగా బాగా దెబ్బతింది. దీంతో 11లక్షల మంది నిరుద్యోగులయ్యారు.
* మరో వైపు బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 84శాతం వాటా ఉన్న రెడీమేడ్ దుస్తుల డిమాండ్ కూడా కొవిడ్ లాక్డౌన్ల కారణంగా దెబ్బతింది. ఆర్డర్లు లభించకపోవడం, రద్దు కావడం, చెల్లింపుల్లో ఆలస్యాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
* విదేశాల్లో నివసించే బంగ్లాదేశ్ వాసులు స్వదేశానికి పంపించే మొత్తాలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అత్యధికంగా విదేశాల నుంచి రెమిటెన్సెస్లు అందుకొనే దేశాల్లో బంగ్లాదేశ్ ఏడో అతిపెద్ద దేశం. 2020-21లో 24.77 బిలియన్ డాలర్లు అందుకోగా.. ఆ తర్వాతి ఏడాది 21.03 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.
* రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడం కూడా బంగ్లాదేశ్కు శాపంగా మారింది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు 33 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది చాలా ఎక్కువ. దీంతోపాటు దేశ రిజర్వు కరెన్సీ నిల్వలు 40 బిలియన్ డాలర్ల కంటే కిందకు చేరిపోయాయి. జులై27 నాటికి 39.48 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా బంగ్లాదేశ్ టకా విలువ మే నెలలో డాలర్కు 86 టకాలు ఉండగా.. ప్రస్తుతం సుమారు 94 టకాల వద్ద కొనసాగుతోంది. దీనికి అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు ఆజ్యం పోశాయి. డాలర్ డిమాండ్ గణనీయంగా పెరిగింది.
భారీగా పెరిగిన ఇంధన ధరలు..
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆగస్టు 5వ తేదీన ఇంధన ధరలను ఇటీవల పెంచారు. డీజిల్, కిరోసిన్ ధరల్లో 42.5శాతం, పెట్రోల్పై 51.1శాతం, ఆక్టేన్పై 51.7శాతం ధరను పెంచారు. ఫలితంగా డీజిల్ కిరోసిన్ 34 టకాలు పెరిగి 114 టకాలకు, పెట్రోల్ 86 టకాలు పెరిగి 130 టకాలకు, ఆక్టేన్ కూడా 89 టకాలు పెరిగి 135 టకాలకు చేరింది. దీంతో బంగ్లాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకొంటున్నాయి.
అప్పుల కోసం తీవ్ర యత్నాలు..
ఢాకా ఐఎంఎఫ్ వద్ద 4.5 బిలియన్ డాలర్ల రుణంతో పాటు పలు సంస్థల వద్ద అప్పుల కోసం యత్నిస్తోంది. ప్రపంచ బ్యాంక్ వద్ద బిలియన్ డాలర్ల రుణం కోసం యత్నాలు చేస్తోంది. వివిధ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల రుణం కోసం యత్నిస్తోంది. ఇక జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ నుంచి కూడా రుణం కోసం యత్నిస్తున్నట్లు అట్లాంటిక్ కౌన్సిల్ కథనంలో పేర్కొంది. ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పినా పలు చోట్ల నుంచి రుణాలను తీసుకుంది. 2020 జూన్ నాటికి 1.7 బిలియన్ డాలర్లు, 2021 అక్టోబర్ నాటికి మూడు బిలియన్ డాలర్లను రుణాలుగా తీసుకొంది. బడ్జెటరీ సపోర్ట్ కింద 2019-20, 2021-22ల్లో 5.8 బిలియన్ డాలర్ల రుణం స్వీకరించింది. దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి 1.4 బిలియన్ డాలర్లు, విదేశీ అప్పుల చెల్లింపుల కోసం ఐఎంఎఫ్ నుంచి 732 మిలియన్ డాలర్లు అప్పు చేసింది. కొవిడ్ మహమ్మారి తర్వాత అనుకున్నంత వేగంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదన్న విషయాన్ని ఇవి చెబుతున్నాయి.
* బంగ్లాదేశ్లో అంతర్గతంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఒక్క 2019లోనే 11.11 బిలియన్ డాలర్ల రుణాలు దేశీయంగా ఎగవేసినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ వెల్లడిస్తోంది. కానీ, ఐఎంఎఫ్ మాత్రం ఈ ఎగవేతల మొత్తం కనీసం రెట్టింపు ఉండొచ్చని చెబుతోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద ఉన్న రిజర్వులు కొన్ని నెలల విదేశీ చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీ రిజర్వులు పుంజుకోకపోతే ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు