Sri Lanka Crisis: రాజపక్సలను దేశం దాటనివ్వని ప్రజలు.. విమానాశ్రయంలో అడ్డగింత..!
ప్రస్తుత శ్రీలంక సంక్షోభానికి అవినీతిమయమైన రాజపక్స కుటుంబ పాలనే కారణమని ఆ దేశ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
కొలంబో: ప్రస్తుత శ్రీలంక సంక్షోభానికి అవినీతిమయమైన రాజపక్స కుటుంబ పాలనే కారణమని ఆ దేశ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వారి కుటుంబాన్ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నవారంతా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేలా పట్టుబట్టారు. ఇప్పుడు ఆయన సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్సను దేశం దాటకుండా అడ్డుకున్నారు. స్వదేశంలో ఎదురవుతోన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోదామనుకున్న ఆయన్ను విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ రోజు ఉదయం బసిల్ రాజపక్స దేశం దాటేందుకు కొలంబో విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి వీఐపీ టర్మినల్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న ప్రజలు బసిల్ను గుర్తుపట్టి.. విమానం వద్దకు చేరుకోకుండా అడ్డుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తెల్లవారుజామున 12.15 గంటలకు ఆయన చెక్ఇన్ కౌంటర్కు వచ్చారు. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ప్రయాణానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మూడు గంటలపాటు అక్కడే వేచి ఉన్నారు. ఇక తాను దేశం వీడటం వీలు కాదని తెలుసుకున్న ఆయన విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారని ఆ వర్గాలు తెలిపాయి.
‘దేశంలోని నెలకొన్న సంక్షోభం కారణంగా.. దేశ అత్యున్నతస్థాయి వ్యక్తులు దేశం వీడకుండా ఉండేలా ఇమ్మిగ్రేషన్ అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. మేం మా భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు వీఐపీ లాంజ్లో విధులు నిర్వర్తించే అధికారులు తమ సేవలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’ అని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమ్మిగ్రేషన్ అధికారుల సంఘం మీడియాకు వెల్లడించింది.
శ్రీలంక గత కొద్ది నెలలుగా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఐఎంఎఫ్ ఇచ్చే రుణం కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు అధ్యక్షుడు గొటబాయను దింపేందుకు శనివారం భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి, విజయం సాధించారు. రేపు ఆయన అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ఆయన తన రాజీనామా సమర్పించేలోపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. విమానాశ్రయంలో అధికారులు పాస్పోర్టుపై స్టాంపు వేసేందుకు వీఐపీ లాంజ్వైపు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని అక్కడి వర్గాల సమాచారం. వాయు మార్గంలో దేశం వీడటం కుదరకపోవడంతో.. సముద్ర మార్గంలో బయటపడేందుకు యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోలింగ్ నౌక ద్వారా గొటబాయ తన స్వదేశాన్ని వీడేందుకు యోచిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ