china: చైనాలో ‘పాక్స్లోవిడ్’ ఉచిత పంపిణీ..!
చైనాలో కరోనా తీవ్రతను తట్టుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘పాక్స్లోవిడ్’ను ఉచితంగా పంచాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: ఫైజర్ రూపొందించిన కరోనా(Covid19) ఔషధం ‘పాక్స్లోవిడ్’ను బీజింగ్లో పంపిణీ చేసేందుకు చైనా(china) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నగరంలోని హెల్త్ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ రంగ మీడియా సోమవారం వెల్లడించింది. ఇప్పటికే బీజింగ్ కొవిడ్ (Covid19) గుప్పిట్లో విలవిల్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వైద్యశాలలు కిక్కిరిసిపోగా.. ఫార్మసీల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికే పాక్స్లోవిడ్ వినియోగంపై ఇక్కడి కమ్యూనిటీ వైద్యులకు శిక్షణ, సూచనలు కూడా ఇచ్చారు. కాకపోతే పంపిణీ ఎప్పటి నుంచి మొదలుపెడతారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చైనా(china)లో కొవిడ్ (Covid19)చికిత్సలో వినియోగించడానికి అనుమతి పొందిన విదేశీ ఔషధం పాక్స్లోవిడ్ ఒక్కటే. ప్రస్తుతం ఇది చైనా(china)లో లభించడంలేదు. గతంలో చైనా(china) రూపొందించిన ‘అజ్వుడిన్’ అనే కొవిడ్ (Covid19) ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురాగా.. కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి.
మరోవైపు దేశంలో కొవిడ్ పరిస్థితిపై అధ్యక్షుడు షీజిన్పింగ్ స్పందించినట్లు చైనా(china) మీడియా సంస్థ సీసీటీవీ పేర్కొంది. కొవిడ్ లక్షిత వ్యూహాలను అనుసరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారని వెల్లడించింది. ‘‘ప్రస్తుతం దేశం కొత్త కొవిడ్ అవుట్ బ్రేక్ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో మనం ఎంతో దేశభక్తితో ఈ ఆరోగ్య ఉద్యమాన్ని లక్ష్యం దిశగా నడిపించాలి’’ అని పేర్కొన్నట్లు వివరించింది. చైనా(china)లో కొవిడ్ విజృంభించిన తర్వాత షీజిన్పింగ్ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే. చైనాలో నిర్విరామంగా పనిచేస్తుండటంతో వైద్యులు చాలా మంది అనారోగ్యం బారినపడుతున్నారు. చాలా మంది డాక్టర్లల్లో జ్వర లక్షణాలు కనిపిస్తున్నా.. పేషెంట్లకు సేవ చేస్తున్నారు. దీంతో చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!