Taiwan : చైనాను భయపెడుతున్న వృద్ధ మహిళ..!
నాన్సీపెలోసీ.. ఈ ఫైర్బ్రాండ్ పేరు వింటేనే చైనా అధినాయకత్వం అప్రమత్తమైపోయింది. ఎంతకైనా తెగించే మొండి రాజకీయ నాయకురాలిగా ఈమెకు పేరు. చైనాను ఇబ్బంది పెట్టడంలో మిగిలిన అమెరికా నాయకులతో
* అమెరికా మొండిఘటం.. తైవాన్కు వెళ్లేనా..?
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
నాన్సీపెలోసీ.. ఈ ఫైర్బ్రాండ్ పేరు వింటేనే చైనా అధి నాయకత్వం అప్రమత్తమైపోతుంది. ఎంతకైనా తెగించే మొండి రాజకీయ నాయకురాలిగా ఈమెకు పేరు. చైనాను ఇబ్బంది పెట్టడంలో మిగిలిన అమెరికా నాయకులతో పోలిస్తే ఈమె తీరు చాలా భిన్నం. అమెరికా నాయకులు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనకాడుతుంటే.. ఈమె అది చేసి చూపిస్తుంది. అది బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కావచ్చు.. తియానన్మెన్ స్క్వేర్ ఘటన కావచ్చు. అమెరికాలో డెమొక్రాట్లను ట్రంప్ ఓ ఆట ఆడుకొంటున్న రోజుల్లో ఈ 82ఏళ్ల వృద్ధ మహిళ మళ్లీ చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చింది. ప్రతినిధుల సభ స్పీకర్గా విజయం సాధించి.. ట్రంప్ వార్షిక ప్రసంగంలోనే స్పీకర్ స్థానంలో కూర్చొని కాగితాలు చించి సంచలనం సృష్టించింది. తాజాగా తైవాన్కు అండగా.. రంగంలోకి దిగింది. దీంతో చైనా ఆందోళనకు గురైనా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. మరోవైపు బైడెన్ కార్యవర్గం కూడా నాన్సీకి నచ్చజెప్పేందుకు శతవిధాల యత్నిస్తోంది.
అసలేం జరిగింది..?
తైవాన్ ప్రజలకు.. అమెరికా ప్రజలు, కాంగ్రెస్ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల తైవాన్కు వెళ్లాలని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ నిర్ణయించుకొన్నారు. తనతోపాటు రావాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లనూ ఆహ్వానించారు. వాస్తవానికి ఏప్రిల్లోనే ఆమె వెళ్లాల్సింది. కానీ, కొవిడ్-19 సోకడంతో ఆ పర్యటన వాయిదా పడింది. 1997లో రిపబ్లికన్ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్ తర్వాత అక్కడికి వెళ్లిన స్పీకర్గా రికార్డు సృష్టించనున్నారు. నాన్సీ తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చైనా విషయంలో ఎప్పుడూ కఠువుగానే వ్యవహరించారు. అటువంటి నేత ఇప్పుడు తైవాన్ వెళ్లడం డ్రాగన్ను భయపెడుతోంది.
చైనాకు వెళ్లి తియనన్మెన్ స్క్వేర్ ఉద్యమానికి సంఘీభావం..
1989లో తియానన్మెన్ స్క్వేర్ ఘటనపై నాన్సీ పెలోసీ తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె స్వయంగా తియనన్మెన్ స్క్వేర్కు వెళ్లి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను 2019లో తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆమె నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడి భద్రతా సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు 2019లో హాంకాంగ్లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు.
వింటర్ ఒలింపిక్స్ దౌత్య బహిష్కరణకు ఆజ్యం..
వీగర్ ముస్లింలపై చైనా దమన కాండకు నిరసనగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బాయికాట్ చేయాలని గతేడాది మేలో ఆమె తొలిసారి పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో చివరికి అమెరికా మిత్రదేశాలు తమ దౌత్యసిబ్బందిని చైనాకు పంపకూడదని నిర్ణయించుకొన్నాయి. దీంతో చైనా కూడా కొవిడ్ను సాకుగా చూపి తాము ఎవరినీ ఆహ్వానించడంలేదని చెప్పి పరువు కాపాడుకొనే యత్నం చేయాల్సి వచ్చింది.
దలైలామాతో భేటీ
గతంలో టిబెట్ వాసులపై చైనా అరాచకాలపై ఈమె గళం విప్పారు. జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలో ఉండగా అప్పట్లో జరిగిన బీజింగ్ సమ్మర్ ఒలింపిక్స్ను బహిష్కరించాలని ఆయనకు సూచించారు. అప్పటికే ఆమె యూఎస్ హౌస్ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుష్ బీజింగ్ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె భారత్కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు.
‘తొలిసారి తైవాన్లోకి చైనా విమానం’ అంటూ బెదిరింపులు..?
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ.. పెలోసీ పర్యటిస్తే అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అమెరికా తన దారిలో తాను వెళితే.. చైనా తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొనేందుకు దృఢమైన కఠిన చర్యలు తీసుకొంటుంది. ఆ తర్వాత ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. మరో వైపు చైనా రక్షణ శాఖ కూడా స్పందించింది. పెలోసీ పర్యటనను రద్దుచేసుకోవాలని అమెరికాను హెచ్చరించింది. తైవాన్ ప్రజలను ప్రజాస్వామ్యం పేరిట రెచ్చగొట్టే యత్నం చేస్తే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే చర్యలు తీసుకొంటామని వెల్లడించింది.
పెలోసీ పర్యటనపై చైనా గ్లోబల్ టైమ్స్ మాజీ ఎడిటర్ హూ షీజిన్ స్పందిస్తూ.. ‘‘ ఒక వేళ పెలోసీ తైవాన్లో పర్యటించాలనుకుంటే.. ఆమె విమానంతోపాటు.. చైనా సైనిక జెట్ విమానం కూడా వస్తుంది. చరిత్రలో తొలిసారి చైనా నుంచి ఓ ఫైటర్జెట్ తైవాన్లోకి వెళుతుంది’’ అంటూ బెదిరింపులకు దిగారు. 2020లో అమెరికా హెల్త్ సెక్రటరీ అలెక్స్ అజర్ తైవాన్లో పర్యటించగా.. అప్పట్లో చైనా యుద్ధవిమానాలు తైవాన్ గగనతలంపై ఎగిరాయి.
పెలోసీ భద్రత అత్యంత కీలకం ఎందుకు..?
అమెరికాలో అధ్యక్షుడు ఏదైనా కారణంతో వైదొలగినా.. కన్నుమూసినా ఎన్నికలు నిర్వహించరు. ఆయన దిగువన ఆ పదవి చేపట్టడానికి గొలుసుకట్టు వ్యవస్థ ఉంటుంది. దీనిలో ఉపాధ్యక్షురాలి తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ రెండో స్థానంలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె భద్రత అత్యంత కీలకమైంది. ఆమె విమానం వెళ్లినప్పటి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే సైనిక వనరులు కూడా వాడాల్సి ఉంటుందని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కెర్బీ వెల్లడించారు. మేము వీటిని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వెల్లడించారు. కాకపోతే ఇప్పటి వరకు పెలోసీ పర్యటనపై అధికారికంగా ప్రకటించలేదన్నారు.
మరోవైపు గురువారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్తో టెలిఫోన్లో మాట్లాడనున్నారు. పెలోసీ పర్యటన అంశం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసిన వేళ టెలిఫోన్ సమావేశం జరగనుండటం విశేషం. ఇప్పటికే బైడెన్ బృందం పెలోసీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గత వారం బైడెన్ మాట్లాడుతూ పెలోసీ పర్యటన అమెరికా సైన్యానికి ఇష్టంలేదని పేర్కొన్నారు. దీనికి పెలోసీ కొంచెం వెటకారంగా స్పందించారు. అమెరికా సైన్యం భయపడుతోందేమో అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం