Ukraine Crisis: ఉక్రెయిన్కు అమెరికా సైనిక సాయం.. రూ.2.63 వేల కోట్లు విడుదల
రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు తమకు సైనిక సాయం అందించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి సైతం చేశారు. ఈ క్రమంలోనే రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్కు రూ.26 వేల కోట్ల సైనిక సాయాన్ని...
ఇంటర్నెట్ డెస్క్: రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు తమకు సైనిక సాయం అందించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్కు రూ.2.63 వేల కోట్ల సైనిక సాయాన్ని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్కు జారీ చేసిన మెమోరాండంలో.. విదేశీ సహాయ చట్టం ద్వారా రూ.2.63 వేల కోట్లను ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించాలని ఆదేశించారు. మరోవైపు ఉక్రెయిన్కు రూ.10.16 వేల కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఈయూ నిర్ణయించినట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. అంతకుముందు తనను కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానిక తరలిస్తామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. మిత్ర దేశాల నుంచి తమకు ఆయుధాలు, సామగ్రి సరఫరా అవుతోన్నట్లు చెప్పారు.
మరోవైపు.. రష్యా ప్రభుత్వంపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. తాజాగా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్పై వ్యక్తిగత ఆంక్షలకు సిద్ధమైంది. ఈ ఇద్దరి ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ శుక్రవారమే నిర్ణయించిన విషయం తెలిసిందే. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. పుతిన్ ఆక్రమణ దిశగా అడుగులు వేశారని అమెరికా భావిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. ఇది పూర్తిగా పుతిన్ నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యావత్తు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి రష్యా చర్యలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడు బైడెన్పై ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ఇతర దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షలతో రష్యా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 11 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్