Joe Biden: ఐర్లాండ్ పర్యటనలో నోరుజారి గందరగోళం సృష్టించిన బైడెన్..!
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరో గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత శ్వేత సౌధం ఆయన్ను సమర్థించింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా (USA) అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) కొన్నేళ్లుగా మాటలపై నియంత్రణ కోల్పోయి గందరగోళ పరిస్థితులను సృష్టించడం సాధారణమైపోయింది. తాజాగా ఐర్లాండ్ (Ireland) పర్యటనలో తొలి రోజే ఇటువంటి ఘటనే చోటు చేసుకొంది. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. న్యూజిలాండ్కు చెందిన రగ్బీ బృందం.. 1920లో ఐరిష్ ప్రజలపై అరాచకాలకు పాల్పడిన బ్రిటిష్ పోలీసులకు మధ్య తేడాను మర్చిపోయారు. ఆయన బుధవారం ఐర్లాండ్లోని డుండల్క్ విండ్సోర్ బార్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ఐదో కజిన్, అంతర్జాతీయ రగ్బీ ఆటగాడు రాబ్ కియార్నె గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు భీకరమైన ఆటగాడు. అతడు ‘బ్లాక్ అండ్ టాన్స్’ను ఓడించాడు’’ అని పేర్కొన్నారు. ఈ మాటలతో అక్కడున్న ప్రేక్షకులు అవాక్కైపోయారు. ఆ తర్వాత బైడెన్ ఆ మాటను సవరించుకొన్నారు.
తన కజిన్ రాబ్ ఓ టైను బహూకరించిన సందర్భాన్ని బైడెన్ గుర్తు చేసుకొనే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. వాస్తవానికి 2016లో జరిగిన ఓ మ్యాచ్లో ఐర్లాండ్ 111ఏళ్లలో తొలిసారి న్యూజిలాండ్కు చెందిన ఆల్ బ్లాక్ రగ్బీ బృందాన్ని ఓడించింది. ఆ సమయంలో రాబ్ ఓ టైను బైడెన్కు ఇచ్చారు. నాటి ఘటనను గుర్తు చేసుకొనే సమయంలో ఈ పొరబాటు దొర్లింది.
ఇక ‘బ్లాక్ అండ్ టాన్స్’ అనేది ఐరిష్ ప్రజలను అణచివేసేందుకు బ్రిటన్ నియమించి పోలీస్ దళం నిక్నేమ్. దాదాపు 100 ఏళ్లపాటు జరిగిన ఐరిస్ స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆ దళం ప్రజలు, రిపబ్లికన్లపై తీవ్రమైన అరాచకాలకు పాల్పడింది. ఈ దళం యూనిఫామ్ ఆధారంగా ఆ పేరు వచ్చింది.
ఈ తప్పుపై శ్వేతసౌధం ప్రతినిధి అమాండ స్లోట్ మాట్లాడుతూ బైడెన్ను సమర్థించారు. ‘‘ఐర్లాండ్లో ప్రతి రగ్బీ ఫ్యాన్కు తెలుసు.. బైడెన్ ప్రస్తావించింది న్యూజిలాండ్కు చెందిన ఆల్ బ్లాక్స్పై ఐర్లాండ్ విజయం సాధించడాన్ని’’ అని పేర్కొన్నారు. మరోవైపు బైడెన్పై ట్విటర్లో ట్రోలింగ్ మొదలైంది. ఐరిష్ హాస్యనటుడు ఓలివర్ కల్లాన్ ట్వీట్ చేస్తూ ‘‘ బైడెన్ శైలిలో అతిపెద్ద గందరగోళమే ఐర్లాండ్ కోరుకొంది’’ అని పేర్కొన్నాడు.
గతంలో కూడా జోబైడెన్ ఇలానే ప్రవర్తించారు. ఉత్తర కరోలినాలో జరిగిన కార్యక్రమంలో బైడెన్ గాల్లో షేక్హ్యాండ్స్ ఇవ్వడం వీక్షకులను గందరగోళానికి గురిచేసింది. మరో సందర్భంలో శ్వేత సౌధంలో జరిగిన సమావేశంలో.. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ ప్రతినిధి సమావేశానికి వచ్చినట్లు జోబైడెన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం