Biden Vs Putin: పుతిన్కు క్షమాపణ చెప్పను : జో బైడెన్
ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్పై చేసిన వ్యాఖ్యలపై తాను వెనక్కి వెళ్లడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు.
అధికార మార్పు తమ విధానం కాదన్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్పై చేసిన వ్యాఖ్యలపై తాను వెనక్కి వెళ్లడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో పుతిన్కు ఎటువంటి క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. పుతిన్ అధికారంలో కొనసాగకూడదని చేసిన వ్యాఖ్య కేవలం ‘నైతిక ఆగ్రహమే’నని.. రష్యాలో అధికార మార్పు తమ విధానం కాదన్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఓ కసాయి, అధికారంలో కొనసాగకూడదంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. అయితే, ఈ అంశంపై అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్హౌస్’ ఇప్పటికే నష్టనివారణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
‘నేను చేసిన వ్యాఖ్యల పట్ల వెనక్కి వెళ్లడం లేదు. వాస్తవం ఏంటంటే.. ఉక్రెయిన్లో రష్యన్ సేనల క్రూరత్వం, అక్కడి చిన్నారుల పరిస్థితి, ఆ కుటుంబాలతో కలిసిన తర్వాత వారిపై పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై నాకు కలిగిన అభిప్రాయాన్ని ఆగ్రహంగా వ్యక్తం చేశాను. అంతేకాని అది అమెరికా విధానం మాత్రం కాదు. అక్కడి పరిస్థితులను చూసిన తర్వాత వేదనతో అలా స్పందించాను. అందుకు నేను క్షమాపణలు చెప్పను’ అని వైట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉక్రెయిన్లో మారణహోమాన్ని కొనసాగించడానికి పుతిన్ చేస్తున్న ప్రయత్నాలను వివరించిన ఆయన.. పుతిన్ ప్రవర్తిస్తున్న తీరును చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోందన్నారు. అయినప్పటికీ రష్యాలో పాలనా మార్పు మాత్రం అమెరికా విధానం కాదని జోబైడెన్ మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఐరోపాలో పర్యటించారు. అందులో భాగంగా పోలండ్లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన బైడెన్.. ఆ దారుణ పరిస్థితులకు కారణమైన పుతిన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు ఓ కసాయి అని, ఆయన ఎంతమాత్రం అధికారంలో కొనసాగవద్దంటూ వ్యాఖ్యానించారు. అయితే, బైడెన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన క్రెమ్లిన్.. తమ అధ్యక్షుడిని రష్యా ప్రజలే ఎన్నుకుంటారంటూ స్పందించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన వైట్హౌస్.. పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చాలనే యోచన తమకు లేదని ప్రకటించింది. ఇదే సమయంలో జో బైడెన్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ