Joe Biden: సైనిక చర్యలో రష్యా పక్షాన చైనా..? ఆధారాల్లేవన్న బైడెన్!
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్పై పుతిన్ అణ్వాస్త్రాలు వినియోగించకుండా నిరోధించడంలో భారత్, చైనాల ప్రభావం కూడా పని చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడించారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దండయాత్ర కొనసాగుతోన్న వేళ.. మాస్కోకు చైనా(China) నుంచి కీలక మద్దతు వెళ్లే అవకాశం ఉందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. రష్యా కొత్తగా దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో చైనా నుంచి ప్రమాదకర ఆయుధాలను అక్కడికి తరలించవచ్చని భావిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Bliken) ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ సైనిక చర్య విషయంలో చైనా.. రష్యా పక్షాన నిలుస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తాజాగా తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందని ఆందోళన చెందుతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బైడెన్ ఈ మేరకు స్పందించారు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు. మరోవైపు.. రష్యాకు చైనా ఆయుధ సాయం అందించడాన్ని చూడలేదని పెంటగాన్ సైతం పేర్కొంది. అధునాతన ఆయుధ సామర్థ్యాలు కలిగి ఉన్న చైనా.. ఉక్రెయిన్ విషయంలో తన తటస్థతను బహిరంగంగానే ప్రకటించిందని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ గుర్తుచేశారు.
‘భారత్, చైనాల ప్రభావం కూడా కారణమే..’
ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదన్న వార్తలు గతంలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ విషయంలో రష్యా వెనకడుగుకు భారత్, చైనాల బలమైన ప్రభావం కూడా కారణమై ఉండొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. లేనిపక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ ఇప్పటికే అణ్వాయుధాలను ప్రయోగించి ఉండొచ్చన్నారు. ‘యుద్ధభూమిలో అణ్వాయుధాల వినియోగాన్ని వ్యతిరేకించడంలో భారత్, చైనాలు.. రష్యాపై కొంచెం ఎక్కువ ప్రభావం చూపాయి’ అని బ్లింకెన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్, రష్యాల మధ్య దశాబ్దాల బంధం ఉందని పేర్కొంటూనే, కొన్నేళ్లుగా భారత్.. అమెరికా, ఫ్రాన్స్లవైపు సైతం మొగ్గుచూపుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!