ఆసీస్కు నో చెప్పి, చైనాకు గిఫ్ట్ ఇస్తున్నారా..? క్వాడ్ సదస్సు రద్దుపై బైడెన్పై విమర్శలు
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన క్వాడ్ కూటమి సదస్సు(Quad summit) ఈ ఏడాది నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకాలేనని చెప్పడంతో ఇది రద్దయింది.
కాన్బెర్రా: వచ్చేవారం ఆస్ట్రేలియాలో జరగనున్న క్వాడ్ సమ్మిట్(Quad summit)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden)హాజరుకానని చెప్పడంతో.. అది కాస్తా రద్దయింది. తన సొంత నగరమైన సిడ్నీలో మూడు శక్తివంతమైన దేశాధినేతలకు(అమెరికా, జపాన్, భారత్) ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Australian Prime Minister Anthony Albanese)కు ఇది ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ కథనాలు అభివర్ణించాయి. క్వాడ్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న చైనాకు ప్రస్తుత పరిస్థితి సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నాయి. ఇది జిన్పింగ్కు బహుమానమని వ్యాఖ్యానించాయి.
అసలేం జరిగిందంటే..?
అమెరికాను డెట్ సీలింగ్ (రుణ గరిష్ఠపరిమితి) సమస్య వెంటాడుతోంది. డెట్ సీలింగ్కు చట్టసభ ఆమోదం లభించకపోతే అగ్రరాజ్యం దివాలా తీసే ప్రమాదముంది. దీంతో ఈ అంశంపై జో బైడెన్ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతంలో మొదలయ్యే తన ఆసియా పర్యటనను బైడెన్ కుదించుకున్నారు. జపాన్లో జరిగే జీ-7 సదస్సుకు హాజరుకానున్న బైడెన్.. ఆ తర్వాత వెళ్లాల్సిన ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాని అల్బనీస్కు.. అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సమాచారమిచ్చారు.
దీనికి ముందు మంగళవారం బైడెన్ పర్యటన గురించి మాట్లాడుతూ.. వచ్చేవారం పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తారని అల్బనీస్ సగర్వంగా ప్రకటించారు. అలా చెప్పారో లేదో కొన్నిగంటల వ్యవధిలోనే తాను రావట్లేదని బైడెన్ సమాచారం ఇచ్చారు. ఇదే ఇబ్బందికర పరిస్థితి అనుకుంటే.. ఈ అధికారిక ప్రకటన కంటే ముందే అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పర్యటన రద్దు గురించి వార్తలు వచ్చాయి. పరిస్థితులు అనుకూలించక ఆస్ట్రేలియా రానని చెప్పిన బైడెన్.. జీ-7(G7 summit) కోసం మాత్రం జపాన్(Japan)వెళ్లారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే క్వాడ్ కూటమి ఏర్పాటును చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆ కూటమిని ఆసియన్ నాటోగా వర్ణిస్తోంది. అందుకే క్వాడ్ విషయంలో ఏ మాత్రం గందరగోళం పరిస్థితులు నెలకొన్నా.. అది జిన్పింగ్ సంతోషాన్ని కలిగిస్తుందని మీడియా కథనాలు రాసుకొచ్చాయి.
జపాన్లో ల్యాండ్ అయిన బైడెన్..
ఈ నెల 19-21 తేదీల్లో జపాన్లోని హిరోషిమా వేదికగా జీ-7 సదస్సు జరగనుంది. ఇందుకోసం బైడెన్ ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. జపాన్లో జరిగే జీ-7 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఆ సదస్సులో భాగంగా మోదీ, బైడెన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
భారత్కు రష్యా అందజేయాల్సిన మిగతా రెండు ‘ఎస్-400’ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదే చేరుకుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM