Bill Gates: సంపన్నుల జాబితా నుంచి బయటకు వచ్చేస్తా : బిల్గేట్స్
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (Bill Gates).. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని ప్రకటించారు.
మహా దాతృత్వవాదిగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (Bill Gates).. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని వెల్లడించారు. తన సంపదలో మరో 20 బిలియన్ డాలర్లు (సుమారు లక్షన్నర కోట్ల)ను బిల్ అండ్ మిలిందా గేట్స్ సంస్థకు అందజేస్తానని ప్రకటించారు. తద్వారా గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు, ప్రణాళికకు సంబంధించిన విషయాలను తన వ్యక్తిగత బ్లాగ్లో రాసుకొచ్చారు.
‘ఒకసారి భవిష్యత్తులోకి తొంగిచూస్తే.. నాకు, నా కుటుంబానికి ఖర్చుచేసినవి మినహా నా సంపదనంత ఫౌండేషన్కే ఇవ్వాలనేది నా ప్రయత్నం. ఇందులో భాగంగా తాజాగా మరో 20 బిలియన్లను ఫౌండేషన్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇలా చేయడం వల్ల కొంతకాలం తర్వాత ప్రపంచ సంపన్నుల జాబితాలోనుంచి బయటకు వస్తాను. ఈ తరహాలో నగదు సహాయం చేయడం త్యాగం కాదు. ప్రపంచం చవిచూస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం కావడాన్ని గొప్పగా భావిస్తాను. ప్రజల జీవితాన్ని మరింత మెరుగుపరచడంలో భాగంగా సమాజానికి తన దగ్గర ఉన్న వనరులను అందించడాన్ని ఉపకారంగా భావిస్తాను’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు.
70 బిలియన్ డాలర్ల ఫౌండేషన్..
‘రెండు దశాబ్దాల నుంచి ఒక బిలియన్ డాలర్ల నుంచి మొదలుకొని ప్రతిఏటా 6బిలియన్ డాలర్లు ఖర్చు చేసే (కొవిడ్ విజృంభణకు ముందు) స్థాయికి ఫౌండేషన్ చేరుకుంది. కరోనా సమయంలోనూ ఏటా 2బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం. 2026 నాటికి దీనిని 9 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇచ్చే 20 బిలియన్ డాలర్లతో గేట్స్ ఫౌండేషన్ విరాళాల విలువను 70 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.5 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించాం’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు. ఇటీవల చవిచూస్తోన్న కరోనా వైరస్, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులతో పాటు ఇతర సంక్షోభాలను ప్రస్తావించిన ఆయన.. ఇటువంటి కష్టకాలంలో మన భాగస్వామ్యం కూడా మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, బిల్గేట్స్ సంపద 113 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. కాగా 217 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిస్థానంలో ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (134 బి.డాలర్లు), బెర్నార్డ్ జీన్ ఆర్నాల్ట్ (127 బి.డాలర్లు) రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇలా ప్రపంచ సంపన్నుల జాబితాలో కొనసాగుతున్న బిల్గేట్స్.. విరాళాలను మరింత పెంచడం ద్వారా త్వరలోనే ఆ జాబితా నుంచి బయటకు రానున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం