Boris Johnson: ‘పార్టీ గేట్’ కుంభకోణం.. బ్రిటన్ ప్రధాని, ఆర్థిక మంత్రికి జరిమానా!
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్కు షాక్! కొవిడ్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగానూ ఈ ఇద్దరికీ జరిమానా పడనున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రధాని భార్య క్యారీ...
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్కు షాక్! కొవిడ్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగాను వీరిద్దరికీ జరిమానా పడనున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రధాని భార్య క్యారీ జాన్సన్కు కూడా పెనాల్టీ నోటీసు జారీ చేయనున్నట్లు చెప్పారు. 2020-21 కొవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలను ఇష్టానుసారం ఉల్లంఘించారంటూ ‘పార్టీ గేట్’ కుంభకోణం పేరిట ఒక్కొక్క విషయం బయటపడిన విషయం తెలిసిందే. కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్న 2020 మే 20న గార్డెన్ పార్టీ, జూన్ 19న బోరిస్ జన్మదిన వేడుకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రంగంలోకి దిగారు.
తాజాగా డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ముగ్గురూ.. మెట్రోపాలిటన్ పోలీసులు జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొన్న నోటిఫికేషన్ను అందుకున్నారని చెప్పారు. అయితే, ఎంత మొత్తంలో జరిమానా విధించారనేది తెలియాల్సి ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా పడిన బ్రిటన్ మొదటి ప్రధాన మంత్రి జాన్సనే కావడం గమనార్హం! ఈ నేపథ్యంలో బోరిస్, సునక్లు తమ పదవులకు రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రతిపక్ష నేత స్టార్మర్ డిమాండ్ చేశారు. గతంలోనూ బోరిస్.. ప్రధాని పదవి వీడాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన మీద ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేయను గాక.. చేయనంటూ జాన్సన్ గతంలోనే స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు