Brazil - Jair Bolsonaro: బ్రెజిల్ ఎన్నికల ఫలితాల తారుమారుకు బోల్సొనారో యత్నం.?
బ్రెజిల్లో జరిగిన అల్లర్లలో మాజీ అధ్యక్షుడు బోల్సొనారో పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన మంత్రి వర్గ సహచరుడి ఇంట్లో కీలక పత్రాలు దొరికాయి.
ఇంటర్నెట్డెస్క్: ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బ్రెజిల్లో బోల్సొనారో(Jair Bolsonaro) మద్దతుదారులు అరాచకం సృష్టించడం వెనుక పెద్ద కుట్రే ఉండొచ్చనేందుకు తగిన ఆధారాలు బయటపడుతున్నాయి. గతంలో బోల్సొనారో ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అండర్సన్ టొర్రెస్ ఇంటిని బ్రెజిల్ పోలీసులు తనిఖీలు చేయగా.. కీలక పత్రాలు బయటపడ్డాయి. దేశ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు వీలుగా దేశంలో ‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ చట్టాన్ని విధించేలా సిద్ధం చేసిన ఆదేశాల ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని దేశ న్యాయ విభాగ ప్రతినిధి లొరినా రెబిరో ప్రకటించారు. దొరికిన పత్రాలను విశ్లేషించగా.. ‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ను అమలు చేయాలని దేశ ఎలక్టోరల్ కోర్టులో ప్రతిపాదించే పత్రాలుగా తేలాయన్నారు. ఈ పత్రాలపై బోల్సొనారో(Jair Bolsonaro) సంతకం లేదని ఆమె వివరించారు.
‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ అనేది బ్రెజిల్లో చట్టపరమైన నిబంధన. ప్రజాజీవనాన్ని కాపాడేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లో జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఇస్తుంది. బోల్సొనారో అక్టోబర్లోనే ఓడిపోగా.. డిసెంబర్ చివరి వరకు పదవిలోనే కొనసాగారు. తాజా ఘటనపై అండర్సన్ టొర్రెస్ స్పందించారు. తాను ఇంట్లో లేనప్పుడు పోలీసులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొన్నారన్నారు. వాటిని వక్రీకరించేలా లీక్ చేశారని ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బ్రెజిల్ చట్టాలంటే తనకు గౌరవమని పేర్కొన్నారు.
సోమవారం బ్రెజిల్లో బోల్సొనారో (Jair Bolsonaro)మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు. సుప్రీంకోర్టు, న్యాయస్థానం, నేషనల్ కాంగ్రెస్ భవనాలను ఆక్రమించారు. ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలాడ సిల్వాను అంగీకరించమన్నారు. ఈ కుట్రను పోలీసులు అణచివేశారు. ఈ అల్లర్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ అధ్యక్షుడు బోల్సొనారో తెలిపారు. పాతగాయం నొప్పి రావడంతో అమెరికాలోని ఒర్లాండోలోని ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో (Jair Bolsonaro)పై లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా విజయం సాధించారు. ఇటీవలే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకించిన బోల్సొనారో.. తన పదవీకాలం ముగియడానికి రెండు రోజుల ముందే డిసెంబరు 31న అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫ్లోరిడాలో ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!