Jair Bolsonaro: లియోనార్డో.. నోరు మూసుకొని ఉండండి..!
ప్రపంచ వ్యాప్తంగా పర్యవరణ అంశాలపై తరుచుగా స్పందించే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు ఓ దేశాధ్యక్షుడి నుంచి కౌంటర్ ఎదురయ్యింది.
హాలీవుడ్ నటుడుకి బ్రెజిల్ అధ్యక్షుడి సూచన
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ అంశాలపై తరచూ స్పందించే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు ఓ దేశాధ్యక్షుడి నుంచి కౌంటర్ ఎదురయ్యింది. అమెజాన్ అడవుల్లో పర్యావరణ ప్రాముఖ్యతపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా అనవసర మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలని హాలీవుడ్ నటుడు లియోనార్డోను డికాప్రియోకు సూచించారు.
‘అమెజాన్కు బ్రెజిల్ పుట్టినిల్లు. వాతావరణ మార్పులతోపాటు ఇతర పర్యావరణ వ్యవస్థలకు బ్రెజిల్ నిలయం. అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం మనందరికి ఎంతో ముఖ్యమైనది. అమెజాన్ అడవులు క్షీణించిపోతోన్న తరుణంలో వాటి పరిరక్షణకు ఉపక్రమించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి. మన గ్రహాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో భాగంగా జరిగే మార్పునకు యువత ఓటింగ్ ఎంతో కీలకం. వచ్చే ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో రిజిస్టర్ చేసుకొని పోలింగ్లో పాల్గొనాలి’ అంటూ బ్రెజిల్ యువతను ఉద్దేశిస్తూ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఇటీవల ట్వీట్ చేశారు.
లియోనార్డో ట్వీట్కు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తాజాగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని లియోనార్డో సూచించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ వ్యవసాయ వాణిజ్యం లేకుంటే ప్రపంచం ఆకలితో అలమటిస్తుందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఉపాధ్యక్షుడు చెప్పిన మాటలను గుర్తుచేశారు. అందుకే పిచ్చి మాటలు మాట్లాడే బదులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదంటూ లియోనార్డోకు సూచించారు. అమెజాన్లో కార్చిచ్చును ప్రస్తావిస్తూ 2019లో లియోనార్డో చేసిన పోస్టు కూడా సరైంది కాదని.. అది 2003లో చోటుచేసుకున్న ఘటన అంటూ హాలీవుడ్ నటుడిపై జైర్ బోల్సోనారో విమర్శలు గుప్పించారు.
ఇదిలాఉంటే, 2019లో జైర్ బోల్సోనారో అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి అమెజాన్ అడవుల్లో విధ్వంసం మరింత పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెజాన్ ప్రాంతంలో చేపడుతోన్న చర్యలు ఆ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు అడ్డుపడుతున్నాయని బోల్సోనారో వాదన. అందుకే ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఆయన బలహీనపరుస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తోన్న టైటానిక్ హీరో లియోనార్డో.. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులను అరికట్టేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఓటుహక్కు ద్వారా యువత మార్పునకు శ్రీకారం చుట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు ఈవిధంగా స్పందించారు. ఈ ఏడాది చివరలో బ్రెజిల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.