Rishi Sunak: సునాక్- అక్షతా సంపద.. ఏడాదిలో రూ.2వేల కోట్లు హాంఫట్!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తిలో భారీ క్షీణత కనిపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల్లోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు ఆవిరయ్యిందట.
లండన్: బ్రిటన్ (Britain) ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak), ఆయన భార్య అక్షతా మూర్తి (Akshata Murty) సంపదపై స్థానికంగా చర్చ జరుగుతూనే ఉంది. దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ.. విలాసవంత జీవితాన్ని గడుపుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా సునాక్ దంపతుల ఆస్తి (Rishi Sunak Wealth)లో భారీ క్షీణత కనిపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల్లోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు ఆవిరయ్యిందట. అంటే రోజూ సుమారు 5లక్షల పౌండ్లు కోల్పోతున్నట్లు లెక్క.
సండే టైమ్స్ ఇటీవల విడుదల చేసిన బ్రిటన్ సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 275వ స్థానంలో కొనసాగుతున్నారు. అంతకుముందు 222వ స్థానంలో ఉండగా.. ఏడాది కాలంలోనే ఈ క్షీణత కనిపించింది. అయితే, ఇన్ఫోసిస్ షేర్లు పతనమవ్వడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. ఇందులో అక్షతా మూర్తికి 64 బిలియన్ డాలర్ల (52 బిలియన్ పౌండ్లు) విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో సునాక్ దంపతుల సంపద కూడా తరిగిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు జీతభత్యాల కింద ఏడాదికి 1.65 లక్షల పౌండ్లు సమకూరుతుంది. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరి సంపద విలువ 730 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. అయితే, ఇటీవల మార్కెట్లు పతనం అవుతుండటంతో వారి సంపద విలువ 529 మిలియన్ పౌండ్లకు (66.8కోట్ల డాలర్లు) పడిపోయింది. మరోవైపు బ్రిటన్ను ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. ప్రస్తుతం అది 10 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను విదేశీ చేతుల్లో పెట్టారని ముయిజ్జు ఆరోపించారు. -
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్