British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్ బుక్ చేస్తే..!
డబ్బులు ఎక్కువగా చెల్లించి విండో సీట్ (Window Seat) బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి (Passenger) వింత అనుభవం ఎదురైంది. విమానం (Plane) ఎక్కిన తర్వాత అక్కడ విండో లేదు. మొత్తం మూసేసి ఉంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన.. ఆ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో(Social media) పోస్టు చేశాడు.
ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు బయటకి చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది విండో సీట్ (Window seat)నే కోరుకుంటారు. విమానాల్లో (Plane) అయితే విండో సీట్కు మరింత క్రేజ్. దాని కోసం ప్రత్యేక ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటారు. అయితే, ఓ విమాన ప్రయాణికుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. టికెట్ ధరకంటే ఎక్కువ చెల్లించి విండో సీట్ కొనుక్కున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తీరా విమానం ఎక్కిన తర్వాత అక్కడ విండో లేదు. మొత్తం మూసేసి ఉంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
అనిరుద్ మిత్తల్ అనే ప్రయాణికుడు లండన్ వెళ్లేందుకు బ్రిటిష్ ఎయిర్లైన్స్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ల్యాండింగ్ సమయంలో వ్యూ బాగుంటుందనే ఉద్దేశంతో విమానం కుడివైపు విండో సీట్ను బుక్ చేసుకున్నాడు. తీరా, విమానం ఎక్కేసరికి అక్కడ మొత్తం మూసేసి ఉంది. ఆయన సీటుకు వెనుకవైపు, ముందువైపు రెండు సీట్లకూ విండో సదుపాయం ఉంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు అక్కడున్న సిబ్బందిని అడిగాడు. అక్కడ విండో ఉండదని తెలిసి కూడా టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించాడు. వాళ్లు కూడా తమకేమీ తెలియదని సమాధానమివ్వడంతో.. కోపం పట్టలేక.. దాని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
‘‘ విండో సీట్ కోసం టికెట్ ధర కంటే ఎక్కువగానే చెల్లించా. కానీ ప్రయోజనం లేకపోయింది’’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ మీరు ‘విండోస్’ యూజర్ అని వాళ్లకు తెలియకపోయి ఉంటుంది. అందుకే మీకు విండో సీట్ కేటాయించలేదు’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. గతంలో నాక్కూడా ఇలాగే జరిగింది. ఎమిరేట్స్ విమానంలో నా కుమారుడి కోసం విండో సీటు బుక్ చేశాను. తీరా అక్కడికి వెళ్లే సరికి విండో లేదు.’ అని మరో యూజర్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్