King Charles Coronation: ఛార్లెస్ పట్టాభిషేకం వేళ.. మేఘన్ మార్కెల్పై ప్యాలెస్ ప్రకటన ఏంటంటే..?
King Charles's Coronation: రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. తన తండ్రి ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఓ సాధారణ అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఆయన ఎలాంటి రాజరిక పాత్రను పోషించట్లేదని సమాచారం. ఇక, హ్యారీ సతీమణి మేఘన్ రాకపై బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటన చేసింది.
లండన్: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపే ఉంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందక్కడ. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్(Charles III)కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి నేడు కిరీటధారణ చేయనున్నారు. ఈ సమయంలో రాజకుటుంబం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాచరికాన్ని వదులుకున్న ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry), ఆయన భార్య మేఘన్ మార్కెల్ (Meghan Markle) పట్టాభిషేకానికి వస్తారా..? లేదా..? అనేదీ ఆసక్తికరంగా మారింది. దీని గురించి బకింగ్ హామ్ ప్యాలెస్ (Buckingham Palace) అధికారిక ప్రకటన చేసింది. హ్యారీ వస్తున్నారని, మార్కెల్ మాత్రం హాజరుకావడం లేదని తెలిపింది. (King Charles's Coronation)
‘మే 6వ తేదీ వెస్ట్మినిస్టర్ అబేలో జరుగుతోన్న పట్టాభిషేక కార్యక్రమానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ (ప్రిన్స్ హ్యారీ) హాజరవుతారు. ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ (మేఘన్ మార్కెల్) కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు’ అని వెల్లడించింది. ఆర్కీ, లిలిబెట్.. హ్యారీ, మేఘన్ సంతానం. రాజ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. ఈ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి.
ఇటీవలకాలంలో రాజకుటుంబం మరీ ముఖ్యంగా ఆయన తండ్రి చార్లెస్, సోదరుడు విలియంతో హ్యారీ సంబంధాలు బెడిసికొట్టాయి. బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ప్రిన్స్ హ్యారీ(Prince Harry) ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్ర రాసిన సంగతి తెలిసిందే. అది తీవ్ర వివాదాస్పదమైంది. ఈ పరిణామాల మధ్యే మేఘన్ పట్టాభిషేకానికి రాకపోవడం గమనార్హం. చివరగా రాణి ఎలిజబెత్(Elizabeth II) అంత్యక్రియల సమయంలోనే హ్యారీ, మేఘన్ రాజకుటుంబంతో కలిసి కనిపించారు. ఈ రోజు కూడా హ్యారీ కొన్ని గంటలు మాత్రమే వేడుకలో పాల్గొని, వెంటనే తిరిగి వెళ్లిపోతారని తెలుస్తోంది. అది కూడా రాజకుటుంబసభ్యులకు దూరంగా వెనుక వరుసలో కూర్చుంటారని బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక, పట్టాభిషేకం వేళ హ్యారీకి ఎలాంటి రాజరిక బాధ్యతలను అప్పగించట్లేదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు