bomb cyclone: అమెరికాలో హిమ విస్ఫోటం..!
అమెరికా(USA)లో బాంబ్ సైక్లోన్ (bomb cyclone)హిమ విస్ఫోటాన్నే సృష్టించింది. అక్కడ ఉష్ణోగ్రతలు -50కంటే కిందకు దిగజారిపోతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)-కెనడా(canada)ల్లో ‘బాంబ్ సైక్లోన్’((bomb cyclone)) బీభత్సం సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో మంచు కొన్ని అడుగుల మేర పేరుకుపోయింది. ఎదుటి వాహనం కూడా కనిపించని స్థాయిలో వెలుతురు పడిపోయింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే మృతుల సంఖ్య 28కి చేరింది. అమెరికా(USA)లోని బఫెలో ప్రాంతం ఈ తుపానుకు తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికా(USA)లో 20 కోట్ల మంది బాంబ్సైక్లోన్ ప్రభావానికి లోనైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే మొత్తం జనాభాలో మూడింట రెండోంతుల మంది మంచుకు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా(USA)లో 15 లక్షల మంది విద్యుత్తు కోతతో ఇబ్బంది పడుతున్నారు.
❃ ఇప్పటికే గురువారం నుంచి సోమవారం వరకు అమెరికా(USA)లో 16,000 విమాన సర్వీసులను రద్దు చేశారు. చాలా ఎయిర్పోర్టులను మూసివేశారు. వీటిల్లో బఫెలో నయాగరా కూడా ఉంది. దీనిని శుక్రవారం మూసివేశారు. దాదాపు 600 మంది మోటరిస్టులు మంచులో చిక్కుకుపోగా ఫస్ట్ రెస్పాండర్లు రక్షించారు.
❃ అమెరికా(USA)లో పది రాష్ట్రాలకు తుపానుపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీటిల్లో మాంటెన్నా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిన్నెసోటా, ఐయోవా, ఇండియానా, మిషిగాన్, నెబ్రాస్కా, విస్కిన్సన్, న్యూయార్క్ ఉన్నాయి.
❃ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. నప్లెస్లో -52 డిగ్రీల చలి నమోదైంది. మియామీలో కూడా -50 డిగ్రీలు చలి రికార్డైంది. బఫెలో ప్రాంతంలో నిరంతరాయంగా 37.25 గంటలపాటు (బ్లిజార్డ్ కండీషన్స్) మంచుతుపాను పరిస్థితులు నెలకొన్నాయి. గంటకు 35 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలి వీస్తే ఈ పరిస్థితులు ఉన్నట్లు భావిస్తారు. శుక్రవారం ఉదయం గంటకు 71 మైళ్ల వేగంతో చలిగాలులు వీచాయి.
❃ న్యూయార్క్లోని స్నైడర్లో 56 అంగుళాల మేర మంచు కురిసింది. మిషిగన్లోని బరగాలో 42 అంగుళాలు, న్యూయార్క్లోని వాటర్ టౌన్లో 34 అంగుళాల మంచు పడింది.
బాంబ్ సైక్లోన్ అంటే ఏమిటీ..?
చాలా వేగంగా తుపానుగా మారే దానిని వాతావరణ శాస్త్రజ్ఞులు బాంబ్సైక్లోన్గా అభివర్ణిస్తారు. వాతావరణంలో చల్లటి గాలి, వెచ్చటి గాలి కలిసిన సమయంలో ఇది ఏర్పడుతుంది. వెచ్చటి గాలి పైకి ఎగసి తక్కువ పీడనం ఏర్పడుతుంది. వాతావరణంలోని తేమ కారణంగా తుపాను మేఘాలు ఏర్పడతాయి. దీనికి వాతావరణంలో గాలి పీడనం 24 గంటల్లో 24 మిల్లీబార్లు పడిపోవడం కూడా చేరితే బాంబ్ సైక్లోన్గా మారుతుంది. భూభ్రమణ ప్రభావం కూడా దీంతో కలిసి పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఇప్పటికే గ్రేట్లేక్స్ ప్రాంతంలో బాంబ్ సైక్లోన్ పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా(USA) జాతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త జాన్ మూర్ వెల్లడించారు. ధ్రువాల నుంచి వచ్చే శీతలగాలుల కారణంగా వాతావరణ పీడనం కనీసం 962 మిల్లీబార్లు పతనమైందని పేర్కొన్నారు.
న్యూయార్క్ గవర్నర్ కేథీతో అమెరికా(USA) అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?