Canada: భారత్లో ఆ రాష్ట్రాల్లో జాగ్రత్త..!
భారత్లో పర్యటనపై తన ప్రజలకు కెనడా ప్రభుత్వం చేసిన సూచనలు చర్చనీయాశంగా మారాయి.
చర్చనీయాంశంగా కెనడా హెచ్చరికలు..!
ఒట్టావా: భారత్లో తమ దేశ వాసుల పర్యటనపై కెనడా ప్రభుత్వం చేసిన సూచనలు చర్చనీయాశంగా మారాయి. పాకిస్థాన్తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లోని ప్రాంతాలకు వెళ్లడంపై అప్రమత్తం చేసింది. అందుకు సరిహద్దు ప్రాంతంలో మందుపాతరల ఉనికిని సాకుగా చూపింది.
‘అనూహ్య భద్రతా పరిస్థితి, మందుపాతరలు, పేలని ఆయుధాల ఉనికి కారణంగా.. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాకిస్థాన్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటనకు ప్రజలు దూరంగా ఉండండి. తిరుగుబాట్లు, ఉగ్రవాదం కారణంగా అస్సాం, మణిపుర్ రాష్ట్రాలకు అత్యవసరమైతే కాని వెళ్లొద్దు. దేశమంతటా ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్లో పర్యటించేప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి’ అంటూ కెనడా ప్రభుత్వం సూచించింది. అయితే, కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్కు మినహాయింపులు ఇచ్చింది.
ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) ఆధ్వర్యంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై రెఫరెండం నిర్వహించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశ వ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు అక్కడి ఓ ఆలయంపైనా దాడి జరిగింది. ఈ విధమైన వరుస ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం.. అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత ఘటనలు(Hate crimes), మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. అందుకు ప్రతిచర్యగా ఈ ట్రావెల్ అడ్వైజరీ రావడం గమనార్హం.
ఒట్టావా ఒప్పందం:
1997 మందుపాతరలకు సంబంధించి ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దీనిని ఒట్టావా ఒప్పందం అని కూడా పిలుస్తారు. దీని కింద మందుపాతరల వాడకం, నిల్వ, ఉత్పత్తి, తరలింపు, విధ్వంసం నిషేధం. దీనిలో అమెరికా, రష్యా సహా భారత్ కూడా భాగస్వామి కాదు. ఈ నేపథ్యంలో కెనడా మందుపాతరల హెచ్చరిక చర్చకు దారితీస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.