Vaccine Tax: టీకా తీసుకోనివారిపై ‘పన్ను’ విధిస్తామన్న ప్రభుత్వం..!
వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఆరోగ్య పన్ను రూపంలో జరిమానా విధిస్తామని కెనడాలోని ఓ ప్రావిన్సు ప్రకటించింది.
టీకా కేంద్రాలకు క్యూ కడుతోన్న కెనడా ప్రజలు
ఒట్టావా: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి సృష్టిస్తోన్న విలయాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు దేశాలన్నీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం కొవిడ్ను నిరోధించే వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇలా మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వాలు ఎంత వారిస్తున్నా.. కొందరు మాత్రం అలసత్వం వహిస్తూనే ఉన్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోని వారిపై కొన్ని ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కెనడాలోని ఓ ప్రావిన్సు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఆరోగ్య పన్ను రూపంలో జరిమానా విధిస్తామని ప్రకటించింది.
వారిలోనే ఆస్పత్రి చేరికలు ఎక్కువ..
కొవిడ్ ఐదో వేవ్ను ఎదుర్కొంటున్న కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగానే ఉంటోంది. ఇప్పటివరకు అక్కడ 12వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతోన్న కొవిడ్ బాధితుల్లో 45శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారేనని తేలింది. ఇలాంటి వారితోనే ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని భావించిన స్థానిక ప్రభుత్వం.. వైరస్ కట్టడికి చర్యలు కఠినతరం చేసింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించింది. జిమ్లు, క్రీడామైదానాలు, థియేటర్లు, విమానాశ్రయాలు, నైట్ క్లబ్లతోపాటు పలు వాణిజ్య దుకాణాల్లోకి ప్రవేశించాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. అయినప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది ముందుకు రాకపోవడంతో జరిమానా విధించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఆరోగ్య పన్ను విధిస్తామని ప్రకటించారు. ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత ఇవ్వనప్పటికీ ఇలాంటి చర్యలు అవసరమని క్యూబెక్ మంత్రి ఫ్రాంకోయిస్ లెగాల్ట్ వెల్లడించారు. ఈ తరహా చర్యలు చేపట్టడం దేశంలోనే తొలిసారి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
టీకా కేంద్రాల వద్ద క్యూ
క్యూబెక్ జనాభాలో 12.8శాతం మంది మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. 85శాతం మంది కనీసం ఒకడోసు తీసుకున్నారు. అయితే, కొవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో మూడోవంతు మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉంటున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించడంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు ఆరోగ్య కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నారు. అంతకుముందు రోజువరకు నిత్యం 2వేల అపాయింట్మెంట్లు ఉండగా.. ప్రభుత్వ ప్రకటన తర్వాత ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ఒక్కరోజే లక్ష మందికిపైగా తొలిడోసు తీసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కనీసం ఇలాగైన ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం ఆశాజనకంగా ఉందని క్యూబెక్ ఆరోగ్యశాఖ మంత్రి క్రిస్టియన్ డ్యూబ్ అభిప్రాయపడ్డారు. అయితే, క్యూబెక్ అధికారుల చర్యలపై అక్కడి పౌరహక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ