China: హువావేపై నిషేధం విధించనున్న కెనడా!
చైనా అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్స్ సంస్థలైన హువావే, జెడ్టీఈలను కెనడా 5జీ నెట్వర్క్ నుంచి నిషేధించనుంది. ఈ మేరకు రెండు సంస్థలపై కొన్ని ఆంక్షలను కెనడా పరిశ్రమల శాఖ
ఇంటర్నెట్డెస్క్: చైనా అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్స్ సంస్థలైన హువావే, జడ్టీఈలను కెనడా 5జీ నెట్వర్క్ నుంచి నిషేధించనుంది. ఈ మేరకు రెండు సంస్థలపై కొన్ని ఆంక్షలను కెనడా పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాకోయిస్ ఫిలిప్ ప్రకటంచారు. ఈ చర్యతో కెనడా మొబైల్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ సంస్థలపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాటలోనే కెనడా ప్రయాణించనుంది.
కెనడా రాజధాని ఒట్టావలో ఫ్రాంకోయిస్ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘మా ఇంటెలిజెన్స్సంస్థలు విశ్లేషించిన తర్వాత.. మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం ప్రకటించాం. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఈ క్రమంలో మా టెలికామ్ నెట్వర్క్ సురక్షితంగా ఉండేందుకు అవసరమైన ఏ చర్య అయినా తీసుకొంటాం. 5జీ ప్రపంచంలో రోజువారీ పనుల కోసం మనం మరింతగా నెట్వర్క్లపై ఆధారపడతాం. మాది సరైన నిర్ణయమే’’ అని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై కెనడాలోని చైనా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందించారు. ‘కెనడా లేవనెత్తిన భద్రతా పరమైన ఆందోళనలు.. రాజకీయంగా లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం’ అని విమర్శించారు. అంతేకాదు, కెనడా, అమెరికాలు కలిసి చైనా కంపెనీలను అణచివేసేందుకు యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. జడ్టీఈ, హువావే సంస్థలు దీనిపై స్పందించలేదు.
కోల్డ్ వార్ సమయంలో అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ షేరింగ్ గ్రూప్ ‘ఫైవ్ఐస్’లో కెనడా కూడా సభ్యదేశం. మిగిలిన సభ్యదేశాలైన అమెరికా, యూకే,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు ఇప్పటికే ఈ సంస్థలపై ఆంక్షలు విధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య