Canada: ఫేక్ ఆఫర్ లెటర్లు..? 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ గండం..!
ఉన్నత విద్య కోసం కెనడా (Canada) వెళ్లిన కొందరు భారతీయులు బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నారు. తప్పుడు దస్త్రాలతో పంజాబ్లోని ఓ కన్సల్టెన్సీ నుంచి వీసాలు పొందినట్లు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) గుర్తించింది. దీంతో వందల మంది భారతీయులు డిపార్టేషన్ లెటర్లు అందించినట్లు సమాచారం.
దిల్లీ: ఉన్నత విద్యను (Foreign Education) అభ్యసించేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్తోన్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలకూ భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కెనడా (Canada) విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లలో కొన్ని తప్పుడువి (Fake Offer Letter) ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో సదరు విద్యార్థులకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) డిపార్టేషన్ లెటర్లు కూడా అందించినట్లు సమాచారం. ఇలా సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ (Deportation) గండాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. (International News)
డిపార్టేషన్ లెటర్లు అందుకున్న కొందరు విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం, పంజాబ్ జలంధర్లో ఓ వ్యక్తి ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ నిర్వహిస్తున్నాడు. కెనడాలోని ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ కోసం ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.16లక్షలు వసూలు చేశాడు. దీంతో వారంతా 2018-19లో అడ్మిషన్ పొంది చదువులు కూడా పూర్తిచేశారు. అంతేకాకుండా వారిలో కొందరు ఉద్యోగాలూ సంపాదించి అక్కడే నివసిస్తున్నారు. ఇంతవరకు బాగానే నడిచింది. కానీ ఇలా వెళ్లిన వారిలో కొందరు కెనడాలో పీఆర్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన సీబీఎస్ఏ.. వీసా కోసం కొందరు విద్యార్థులు సమర్పించిన దస్త్రాలు నకిలీవని గుర్తించారు. ఇవన్నీ జలంధర్ కేంద్రంగా ఉన్న ఆ కన్సల్టెన్సీవేనని.. 2018-2022 మధ్య కాలంలో అక్కడనుంచి సుమారు 700 మంది కెనడాలో చదువులకు ఆఫర్ లెటర్లు పొందినట్లు సమాచారం.
ఈ తరహా భారీ మోసం వెలుగుచూడటం కెనడాలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అయితే, బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో పంజాబ్లోని జలంధర్ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెనడాలో తప్పుడు దస్త్రాల అంశానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జలంధర్ పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత