Canada wildfires: కెనడాలో మంట.. అమెరికాలో తంటా!
ఇంట్లోంచి బయటకు రాకండి.. ఆరోగ్యాలు పాడవుతాయి.. తలుపులు మూసేయండి! మాస్కులు పెట్టుకోండి! కెనడాలో పరిస్థితిని అదుపులోకి తేవటానికి సాయం చేస్తున్నాం.. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ ప్రజలకు, ముఖ్యంగా తూర్పు ప్రాంత రాష్ట్రాలవాసులకు చేసిన హెచ్చరిక.
న్యూయార్క్లో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం
పలు రాష్ట్రాలకు బైడెన్ హెచ్చరిక
విమాన ప్రయాణాలు, టోర్నీలకు అంతరాయం
ఇంట్లోంచి బయటకు రాకండి.. ఆరోగ్యాలు పాడవుతాయి.. తలుపులు మూసేయండి! మాస్కులు పెట్టుకోండి! కెనడాలో పరిస్థితిని అదుపులోకి తేవటానికి సాయం చేస్తున్నాం.. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ ప్రజలకు, ముఖ్యంగా తూర్పు ప్రాంత రాష్ట్రాలవాసులకు చేసిన హెచ్చరిక. అమెరికా వాతావరణ శాఖ కూడా ఇలాంటి హెచ్చరికే జారీ చేసింది. కెనడాలో బాగోలేకుంటే అమెరికన్లు ఇళ్లకు పరిమితమవడం ఎందుకు? అసలు కెనడాలో ఏమైంది? అమెరికా ఎందుకు జాగ్రత్త పడుతోంది?
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, రాలీ, కొలంబియా సిన్సినాటి, క్లీవ్లాండ్, డెలావేర్, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినాలాంటి చోట్ల రెండు రోజులుగా దట్టమైన పొగలు ఆవరించాయి. చాలాచోట్ల ఆకాశానికి ఊదారంగు దుమ్ముదుప్పటి కప్పుకొన్నట్లుంది. స్కూళ్లలో బయటి కార్యకలాపాలు రద్దు చేశారు. న్యూయార్క్ పట్టణంలోనైతే.. బుధవారం వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రమాదకర స్థాయిలో 500 ఏక్యూఐ నమోదైంది. 1999లో వాయునాణ్యతను రికార్డు చేయటం మొదలెట్టిన తర్వాత న్యూయార్క్లో ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పరిగణిస్తారు. అందుకే.. అమెరికా వాతావరణ శాఖ అనేక రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని సలహా ఇచ్చింది. బైడెన్ సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ‘‘మనం ప్రస్తుతం ప్రమాదకర వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు అధికారులు చెప్పినట్లు విని... ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి’’ అని ఆయన సూచించారు. ఫిలడెల్ఫియాలో మేజర్ లీగ్ బేస్బాల్ టోర్నీని వాయిదా వేశారు. విమాన ప్రయాణాలకూ అంతరాయం కలుగుతోంది. ఇంతకూ అమెరికాలో ఉన్నట్టుండి ఇదంతా ఎందుకు జరుగుతోంది? పొగ ఎందుకు కమ్ముకుంటోందంటే.. సమస్యకు మూలం కెనడాలో ఉంది!
చరిత్రలో ఎన్నడూ లేనంతగా..
కెనడాలో అనేక రాష్ట్రాల్లో వేసవి ఆరంభంలోనే కార్చిచ్చు అంటుకుంది. దాదాపు 500 చోట్ల అడవులు అంటుకొని మండుతున్నాయి. ఏటా కెనడా అడవుల్లో కార్చిచ్చు సర్వసాధారణమే. అయితే అది ప్రతిసారీ పశ్చిమ రాష్ట్రాలకే పరిమితమయ్యేది. ఈసారి మాత్రం తూర్పు ప్రాంత రాష్ట్రాలైన నోవా స్కాటియా, క్యూబెక్, ఆంటారియోలాకూ విస్తరించటంతో కెనడా ఉక్కిరిబిక్కిరవుతోంది. రికార్డు స్థాయిలో ఈసారి కార్చిచ్చు అంటుకుందని చెబుతున్నారు. వేసవి ఆరంభంలోనే దాదాపు 80 లక్షల ఎకరాల్లో ఈ మంటలు విస్తరించాయి. ఏప్రిల్లో బ్రిటిష్ కొలంబియా, అల్బర్టాల్లో మొదలైన కార్చిచ్చు కారణంగా 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ చమురు ఉత్పత్తి కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఒటావా, టొరంటో నగరాల్లోని ప్రజలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఒటావాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ఏమీ కనిపించటం లేదు. కెనడా అడవుల్లోని మంటల పొగ.. గాలిలో ప్రయాణించి పక్కనే ఉన్న అమెరికా రాష్ట్రాలను కమ్ముకుంటోంది. మరోవారంపాటు ఈ పొగ ప్రభావం ఇలాగే కొనసాగొచ్చంటున్నారు. మానవ తప్పిదాలతోపాటు వాతావరణ మార్పుల కారణంగానే కార్చిచ్చు విస్తరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాన్ని నియంత్రించటానికి కెనడా ఇతర దేశాల.. ముఖ్యంగా అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే 600 మంది అగ్నిమాపక సిబ్బందిని కెనడాకు పంపించాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి కూడా త్వరలోనే బృందాలు ఆ దేశానికి రాబోతున్నాయి. మరోవైపు కెనడా కార్చిచ్చు పొగ తమ వరకూ విస్తరించవచ్చని నార్వే ఆందోళన చెందుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్