India-Canada: ‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
India-Canada Diplomatic Row: భారత్తో బంధం తమకు ముఖ్యమైనదే అయినప్పటికీ.. తమ దేశ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు.
టొరంటో: ఖలిస్థానీ అంశంతో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంపై కెనడా (Canada) రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ (India)తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందని తెలిపారు. (India Canada Diplomatic Row)
‘‘నిజ్జర్ హత్య కేసులో భారత్పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తాం. అదే సమయంలో దిల్లీతో మా భాగస్వామ్య బంధం కూడా కొనసాగుతుంది. భారత్తో బంధం మాకు ‘ముఖ్యమే’. అయితే, ఈ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఇది సవాల్తో కూడుకున్న సమస్యగా మారుతుందని మాకు తెలుసు. కానీ, మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం మా బాధ్యత. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ ఆరోపణలు నిజమైతే.. అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుంది. మా గడ్డపై మా పౌరుడిని (నిజ్జర్ను ఉద్దేశిస్తూ) హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రి (Canada Minister) బ్లెయిర్ వ్యాఖ్యానించారు.
కెనడాకు సమాచారమిచ్చింది అమెరికాయే
ట్రూడోకు జైశంకర్ కౌంటర్..
మరోవైపు నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) మరోసారి గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న ఆయన భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలను గురించి ప్రస్తావిస్తూ.. ట్రూడోపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘స్వేచ్ఛ పేరుతో ఎలాగైతే చాలా పనులు జరుగుతున్నాయో.. మార్కెట్ పేరుతోనూ చాలా జరుగుతాయి’’ అని జైశంకర్ అన్నారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మొదలైన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు, దౌత్యవేత్తల బహిష్కరణలు జరిగాయి. కాగా.. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని కొట్టిపారేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
కెనడా స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అఫ్గానిస్థాన్లో మహిళల విద్యపై తాలిబన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
ఇజ్రాయెల్ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. -
Modi-Putin: మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్-రష్యా(India-Russia) మధ్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) అన్నారు. అలాగే మోదీ విధానాలను ప్రశంసించారు. -
White House: పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకేసు భారత్-అమెరికా మధ్య ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. తాజాగా శ్వేతసౌధం ఈ కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తును ఆశిస్తున్నట్లు ప్రకటించింది. -
కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో ఆగంతుకులు గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో కలకలం రేగింది. -
చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఆత్మహత్య!
ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్ గాంగ్. -
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఛైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. -
ఖాన్ యూనిస్లో హోరాహోరీ
గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది. -
అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్ వేగాస్లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. -
ఇక ఫేస్బుక్ మెసెంజర్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తప్పనిసరి
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్కు ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది. -
డేటింగ్లో భారత్, అమెరికా
భారత్-అమెరికా బంధం ప్రపంచానికి మేలు చేస్తుందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. అలాగే రెండు దేశాల బంధాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్గా అభివర్ణించారు. -
ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత
తమ సైన్యంలో ఉన్న ఓస్ప్రే వీ-22 విమానాల సేవలను వెంటనే నిలిపివేయాలని (గ్రౌండింగ్) అమెరికా నిర్ణయించింది. -
మార్చి 17న రష్యా ఎన్నికలు.. పోటీపై ఇంకా పెదవి విప్పని పుతిన్
రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు. -
రష్యాలో కాల్పులకు పాల్పడిన విద్యార్థిని.. ఒకరి మృతి
రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. -
అందరికీ కరోనా సోకాలని నేను కోరుకోలేదు
కరోనా వైరస్ బ్రిటిష్ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఖండించారు. -
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర అంశం.. భారత్పై అమెరికా సెనెటర్ల విమర్శ
న్యూయార్క్లో ఓ సిక్కు వేర్పాటువాదిని హతమార్చడానికి భారత ప్రభుత్వాధికారి ఒకరు కుట్రపన్నారనే ఆరోపణను పురస్కరించుకుని అమెరికా పాలక, ప్రతిపక్ష సెనెటర్లు భారత్పై విమర్శలు గుప్పించారు. -
నిక్కీ హేలీ అవినీతిపరురాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది. -
టైప్ 1 మధుమేహానికి కీళ్లవాతం మందు
కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్ మందు ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. -
గాజా సంక్షోభంతో ప్రపంచానికి ముప్పు
గాజా సంక్షోభంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అనూహ్యంగా స్పందించారు. యూఎన్ చార్టర్లో సెక్రటరీ జనరల్కు విశేషాధికారాలు కల్పించే అధికరణం 99ను ఉపయోగిస్తూ.. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు.


తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?