Brussels Metro: మెట్రోముందుకి మహిళను తోసేసిన యువకుడు..డ్రైవర్ షాక్లోకి!
ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది! బెల్జియంలోని మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి.. ప్లాట్ఫాంపై ఉన్న ఓ మహిళను కదులుతున్న రైలు ముందుకి ఒక్కసారిగా తోసేశాడు. అయితే, క్షణాల వ్యవధిలో మెట్రో డ్రైవర్ స్పందించి రైలును నిలిపేయడంతో.. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు...
బ్రసెల్స్: ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది! బెల్జియంలోని మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి.. ప్లాట్ఫాంపై ఉన్న ఓ మహిళను కదులుతున్న రైలు ముందుకి ఒక్కసారిగా తోసేశాడు. అయితే, క్షణాల వ్యవధిలో మెట్రో డ్రైవర్ స్పందించి రైలును నిలిపేయడంతో.. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకొన్నారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లోని రోజియర్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మహిళను రైలు ఎదుటకు నెట్టేయడానికి ముందు ఆ వ్యక్తి ప్లాట్ఫాంపై అటుఇటు తిరుగుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. సరిగ్గా రైలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమెను వెనుక నుంచి పట్టాలపైకి తోసేశాడు.
ఊహించని ఈ ఘటనతో ఆమె పట్టాలపై పడిపోగా.. మెట్రో డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు క్షణాల్లో ఆగిపోయింది. తోటి ప్రయాణికులు హుటాహుటిన ఆమెను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మెట్రో డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించారు.. కానీ, ఆయన కూడా షాక్లో ఉన్నారని బ్రస్సెల్స్ ఇంటర్కమ్యూనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనంతరం మహిళ, మెట్రో డ్రైవర్.. ఇద్దరినీ వైద్యశాలకు తరలించారు. మరోవైపు నిందితుడు వెంటనే అక్కడినుంచి తప్పించుకొన్నాడు. అయితే, అతన్ని వెంటనే మరో మెట్రో స్టేషన్లో అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం అభియోగాలు మోపినట్లు తెలిపారు. పోలీసులూ ఈ ఘటనపై విచారణ ప్రారంభించారని, అతని మానసిక పరిస్థితిని పరిశీలించనున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..