ChatGPT: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ‘చాట్జీపీటీ’ పరిష్కారం.. ఏం చెప్పిందంటే..?
మరి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారుతున్న రష్యా సైనికచర్యను కృత్రిమ మేధ ఆపగలదా? ఈ యుద్ధానికి (Russia Ukraine War) చాట్జీపీటీ (ChatGPT) సూచించిన మధ్యవర్తిత్వ పరిష్కారమేంటీ..?
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT) గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)తో పనిచేసే ఈ టూల్.. ఎలాంటి ప్రశ్నకైనా ఆసక్తికర బదులిస్తోంది. దీంతో చాట్జీపీటీ(ChatGPT)తో పలువురు సంభాషణలు జరిపి, సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్ కూడా ఈ జాబితాలో చేరారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (Russia Ukraine War)లో మధ్యవర్తిత్వ ప్రణాళిక గురించి ఆయన చాట్బోట్ను అడగ్గా.. చాట్జీపీటీ సుదీర్ఘ సమాధానమిచ్చింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారుతున్న రష్యా సైనికచర్యను కృత్రిమ మేధ ఆపగలదా? ఈ యుద్ధానికి (Russia Ukraine War) చాట్జీపీటీ ఇచ్చిన పరిష్కారమేంటీ..?
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (Russia Ukraine War)లో మధ్యవర్తిత్వ ప్రణాళికను సూచించాలని వికాస్ స్వరూప్ ఇటీవల చాట్బోట్ (Chatbot)ను అడిగారు. దీనికి చాట్జీపీటీ (ChatGPT) 8 పాయింట్లలో ‘సాధ్యమయ్యే’ పరిష్కారాన్ని సూచించింది. ‘‘ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు చాలా క్లిష్టమైనవి, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నవి. దీనిపై ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కాస్త సవాలుతో కూడుకున్నదే. అయితే, చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాలు ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహకారం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం, సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ: ఈ ఎనిమిది అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశముంది’’ అని చాట్జీపీటీ (ChatGPT) సమాధానమిచ్చింది. ఈ జవాబును వికాస్ స్వరూప్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
గొప్ప ప్రయత్నం: శశి థరూర్
అయితే, ఈ ట్వీట్కు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తాజాగా స్పందిస్తూ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ‘‘వికాస్ స్వరూప్ చొరవ ఆసక్తికరమైనదే. కానీ, ఆ ఇరు దేశాధినేతలు(పుతిన్, జెలెన్స్కీని ఉద్దేశిస్తూ).. కృత్రిమ మేధ అంచనాలకు మించి ప్రవర్తించేవారు. ఈ ప్రత్యేక కేసులో (యుద్ధం గురించి).. చాట్జీపీటీ ఇచ్చిన సమాధానంపై ఇరు దేశాల నుంచి అభ్యంతరాలు రావొచ్చు. ముఖ్యంగా రష్యన్ల నుంచి. అయితే ఇదే గొప్ప ప్రయత్నం’’ అని థరూర్ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.