Ukraine Crisis: ఉక్రెయిన్లో చెచెన్ సైన్యం.. రష్యా సేనలకు మద్దతు..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అత్యంత విధేయుడిగా చెప్పుకునే చెచెన్యా అధ్యక్షుడు రంజాన్ కదిరొవ్ ఉక్రెయిన్లోకి అడుగుపెట్టారు.
పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం
కీవ్: ఉక్రెయిన్పై సైనిక చర్యను మరింత ముమ్మరం చేసిన రష్యా.. భీకర దాడులకు పాల్పడుతోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా కొనసాగుతోన్న ఈ దాడుల్లో వేల మంది సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అత్యంత విధేయుడిగా చెప్పుకునే చెచెన్యా అధ్యక్షుడు రంజాన్ కదిరొవ్ ఉక్రెయిన్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే రష్యా సైన్యం చేస్తోన్న భీకర దాడులకు చెచెన్ సైన్యం చేతులు కలపడంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్లో అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఉక్రెయిన్పై విరుచుకుపడుతోన్న రష్యా సేనలు, రాజధాని కీవ్ను హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిస్పందిస్తుండడంతో పూర్తిస్థాయిలో కీవ్ను సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే రష్యా సేనలకు మద్దతు ఇచ్చేందుకు చెచెన్ సైన్యం రంగంలోకి దిగింది. తాజాగా ఈ విషయాన్ని చెచెన్ అధినేత రంజాన్ కదిరొవ్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి.. మిలటరీ యూనిఫామ్లో ఉన్న రంజాన్ కదిరొవ్, దురాక్రమణ ప్రణాళికను తన సైనికులకు వెల్లడిస్తోన్న వీడియోను చెచెన్ అధికారిక మీడియా పోస్టు చేసింది. అంతకుముందు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ మరో వీడియోను విడుదల చేసింది. హోస్తోమెల్లో చిత్రీకరించిందిగా భావిస్తోన్న ఆ వీడియోలో.. ‘కీవ్కు దాదాపు 20కి.మీ చేరువలోనే ఉన్నాం. ఉక్రెయిన్ సైన్యం లొంగిపోండి.. లేదంటే ఖతం చేస్తాం’ అంటూ చెచెన్ అధినేత చేసిన హెచ్చరికలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో పుతిన్ అనుకూల వేర్పాటు వాదులకు చెచెన్ అధినేత రంజాన్ కదిరోవ్ మద్దతు ఉంది. క్రిమియా ఆక్రమణ సమయంలోనూ రెబల్స్కు కదిరోవ్ సహకారం అందించారు. తాజాగా ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న దురాక్రమణలోనూ చెచెన్ సైన్యం తమవంతు సహకారం అందించేందుకు కీవ్కు చేరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా చెచెన్ సైన్యం దాడులతో ఉక్రెయిన్ నగరాలు మరింత వణికిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.