Ukraine Crisis: రసాయన కర్మాగారంపై రష్యా దాడి.. వందల మంది ప్రాణాలకు ముప్పు..!
ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివీరోదొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న అజోట్ కెమికల్ ప్లాంట్పై భారీగా షెల్లింగ్ చేశారు. దీంతో అక్కడి రేడియేటర్లలో టన్నుల
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివీరోదొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న అజోట్ కెమికల్ ప్లాంట్పై భారీగా షెల్లింగ్ చేశారు. దీంతో అక్కడి రేడియేటర్లలో టన్నుల కొద్దీ చమురు లీకవుతోంది. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకొన్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎంత మేరకు ప్రాణనష్టం చోటు చేసుకుందో తెలియరాలేదు. ప్లాంట్లోని అండర్గ్రౌండ్ బాంబ్ షెల్టర్లలో మాత్రం 800 మంది వరకు తలదాచుకొని ఉంటారని అంచనావేస్తున్నారు.
ఇక్కడి పోరాటంపై లుహాన్స్క్ గవర్నర్ షెర్లీ హైడెన్ మాట్లాడుతూ.. పరిస్థితి కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ వీధి పోరాటాల్లో తమ సైనికులు గెలుస్తున్నారని.. కానీ, రష్యా శతఘ్నులు మాత్రం ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో తమ దళాలు దాక్కోవడానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇక ఖెర్సాన్, జపార్జియాలో తమ దళాలు కొన్ని పట్టణాలు, గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకొన్నాయని వెల్లడించారు.
రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పాస్పోర్టుల జారీ..
ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకొన్న ఖెర్సాన్, మెలిటోపోల్లలో ప్రజలకు రష్యా పాస్పోర్టులను జారీ చేస్తోంది. ఇప్పటికే కొంత మంది చేతికి వీటిని అందజేసింది. ఈ పరిణామాలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఆక్రమిత ప్రాంతాల్లో రష్యా ప్రజలను సృష్టిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల 23 మంది ఖెర్సాన్ వాసులకు పాస్పోర్టులు జారీ విషయాన్ని రష్యాకు చెందిన వార్తా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని వేల మంది పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకొన్నట్లు వెల్లడించింది. రష్యా ఇక్కడ మిలటరీ గవర్నర్గా వొలొద్మిర్ సాల్డోను నియమించింది. ఇటీవల సాల్డో మాట్లాడుతూ ‘‘ఖెర్సాన్ ప్రజలు రష్యా పౌరసత్వం కావాలని కోరుకొంటున్నారు’’ అని పేర్కొన్నారు.
గతంలో రష్యా ఆక్రమించుకొన్న క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల్లో ఇదే విధంగా పౌరసత్వాన్ని జారీ చేసింది. తాజాగా రష్యా ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోందని ఉక్రెయిన్ భయపడుతోంది. ఒక్కసారి ఇక్కడి వారికి రష్యా పౌరసత్వం జారీ చేస్తే.. ఇక వీరి రక్షణ బాధ్యత క్రెమ్లిన్కు దక్కుతుంది. అప్పుడు తిరిగి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్