Train: అక్కడ రైలు నడవాలంటే పట్టాలకు మంట పెట్టాల్సిందే!

పైచిత్రం చూసి ఏ తీవ్రవాదులో, నక్సలైట్లో రైల్వే ఆస్తుల్ని దహనం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. రైల్వే సిబ్బందే ఇలా పట్టాలకు నిప్పు పెట్టారు. ఎందుకంటారా..? చలికాలంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ఈ విధంగా చేస్తుంటారట. యూఎస్‌లోని చికాగోలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా

Published : 31 Jan 2022 01:12 IST

చికాగో: పైచిత్రం చూసి ఏ తీవ్రవాదులో, నక్సలైట్లో రైల్వే ఆస్తుల్ని దహనం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. రైల్వే సిబ్బందే ఇలా పట్టాలకు నిప్పు పెట్టారు. ఎందుకంటారా..? చలికాలంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ఈ విధంగా చేస్తుంటారట. యూఎస్‌లోని చికాగోలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో మంచు పేరుకుపోయి పట్టాలు సంకోచించి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పట్టాలకు నిప్పు పెడుతున్నారు. ఆ వెచ్చదనానికి పట్టాలు రైళ్ల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అయితే, పట్టాల వెంట కనిపిస్తున్నది నిజమైన మంట కాదండోయ్‌. ప్రత్యేక ట్యూబులర్‌ హీటింగ్‌ వ్యవస్థతో ఏర్పడిన సెగలు. చూడటానికి అవి మంటల్లాగే కనిపిస్తుంటాయి. వీటి వల్ల రైళ్లకు ఎలాంటి ప్రమాదముండదు. చలికాలం పోగానే ఈ వ్యవస్థను తొలగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని