China: జనాభా పెంచేందుకు చైనా అవస్థలు.. వధువులకు సొమ్ము ఇవ్వడంపై చర్యలు
చైనా(china)లో జనాభా పెంచేందుకు వినూత్న చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెళ్లి సమయంలో వధువకు ఇచ్చే ‘కైలీ’పై దృష్టిపెట్టింది.
ఇంటర్నెట్డెస్క్: చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువు వద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటివారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. దీనిని ‘కైలీ’ అంటారు. చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందుకోసం వరుడి కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబీకులకు చెల్లించాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఈ సంప్రదాయాన్ని అడ్డుకొనేందుకు చైనా యత్నించింది.
జననాల రేటు పతనాన్ని అడ్డుకొనేందుకు తాజాగా మరోసారి చైనా అధికారులు ఈ సంప్రదాయంపై దృష్టిపెట్టారు. ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా పెళ్లిళ్ల వ్యవహారం ఖరీదుగా మారిపోయింది. ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకొని సంతానాన్ని కంటున్నారు. ఈ పరిస్థితికి ‘కైలీ’ కారణమని భావిస్తున్నారు. జనవరిలో సెంట్రల్ హుబే ప్రావిన్స్లో అధికారులు కైలీ విధానం అమలు చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు జింగ్సి నగరంలో కైలీ అడగబోమని యువతుల చేత సంతకాలు చేయించారు. ఉమెన్స్ డే సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్ రాజధానిలో సామూహిక వివాహాలను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పాలసీలను తీసుకొస్తున్నారు. సంతానం కన్నవారికి సబ్సిడీలు ఇవ్వడం, పెళ్లిళ్లకు అదనపు లీవ్లు ఇవ్వడం వంటివి ప్రవేశపెట్టింది. దీంతోపాటు పెళ్లిచేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకొనే అవకాశం కూడా ఇస్తున్నారు. కానీ, ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. సమాజంలో స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్పింగ్ సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. చైనాలో కొన్ని చోట్ల వరుడి కుటుంబీకులు సొమ్ము తీసుకొనే సంప్రదాయం కూడా ఉంది. కానీ, అధికారులు దానిపై దృష్టిపెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
చైనాలో వన్ఛైల్డ్ పాలసీని అమలు చేసిన సమయంలో కైలీ విధానం అమల్లోకివచ్చింది. ఆ సమయంలో పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి.. స్త్రీల సంఖ్య తగ్గింది. దీంతో వధువు కుటుంబీకులు భారీ స్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు.
తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది. 2021 కంటే 2022 చివరినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని అక్కడి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) మంగళవారం తెలిపింది. 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు ఉండటంతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు. ఇందులో పురుషులు 72.2 కోట్లు ఉండగా, మహిళలు 68.97 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్క చైనా ప్రధాన భూభాగానికే పరిమితం. హాంకాంగ్, మకావ్ భూభాగాలతోపాటు స్థానికంగా ఉంటున్న విదేశీయులను పరిగణనలోకి తీసుకోలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణ.. కె.ఆర్.చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
-
General News
Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత
-
Crime News
Crime News: పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!
-
India News
Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక.. సీఈసీ ఏం చెప్పారంటే..?
-
Politics News
Komatireddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై సీబీఐ విచారణ జరిపించాలి: కోమటిరెడ్డి