China: ఆ ‘జోక్’కు మూల్యం రూ.17 కోట్లు!
చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ కమెడియన్పై (Comedian) అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు పనిచేస్తోన్న కంపెనీకి భారీ జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను నవ్వించేందుకు ఓ చైనా (China) కమెడియన్ వేసిన ఓ జోక్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ షోలో చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచే విధంగా స్టాండప్ కమెడియన్ (Stand-up comedy) వేసిన జోక్పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ హాస్యనటుడు పనిచేస్తున్న కంపెనీకి చైనా ప్రభుత్వం 14.7 మిలియన్ యువాన్ల (సుమారు 2.13 మిలియన్ డాలర్లు) భారీ జరిమానాను విధించింది.
బీజింగ్లోని సెంచరీ థియేటర్లో మే 13న నిర్వహించిన ఓ కార్యక్రమంలో లీ హవోషి అనే స్టాండప్ కమెడియన్ (Comedian) ఓ ప్రదర్శన ఇచ్చాడు. అందులో భాగంగా తాను షాంఘైకి వెళ్లిన సమయంలో రెండు వీధి కుక్కలను ఎలా దత్తత తీసుకున్నాడో అని వివరిస్తూ.. చైనా సైన్యం (People’s Liberation Army) చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. చైనా సైనికులను ప్రశంసిస్తూ అధ్యక్షుడు జిన్పింగ్ 2013లో ఆ నినాదాన్ని వాడారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కమెడియన్ చెప్పిన ఆ జోక్ అసభ్యకరంగా ఉందంటూ అక్కడి సోషల్ మీడియాలో అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో ఆ పోస్టుపై తీవ్ర చర్చ జరగడమే కాకుండా.. ప్రజలనుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో సదరు కమెడియన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తదుపరి కొన్నిరోజులపాటు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ కూడా అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజింగ్ కల్చరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ.. ఆ కమెడియన్ పనిచేస్తున్న మీడియా సంస్థపై దర్యాప్తునకు ఉపక్రమించింది. కమెడియన్ వేసిన జోక్ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందని పేర్కొన్న చైనా సాంస్కృతిక శాఖ.. సదరు కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల (సుమారు రూ.17కోట్లు) జరిమానా విధించింది. కేవలం ఇదే కాకుండా.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే సెలబ్రిటీలు, నటులపైనా చైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి