China: ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అక్రమ పోలీస్ స్టేషన్లు..’!
అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్ వంటి దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్ పోస్టులను ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే 21 దేశాల్లో 30 తెరిచిందన్న తాజా నివేదిక
బీజింగ్: ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలని చూస్తోన్న చైనా (China).. ఇందుకోసం కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్తోపాటు అనేక దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్ పోస్టులను (Police Stations) ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ.. సొంత దేశంపై వ్యతరేకంగా మాట్లాడే వారిని అణచివేసే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయనే చెబుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల్లోనూ చైనా తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
విదేశీ గడ్డపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణచివేసేందుకు గాను కెనడాలో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (PSB)కి అనుబంధంగా ఈ ‘అనధికారిక పోలీస్ సేవా కేంద్రాల’ (Police Service Stations) ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, కెనడా వ్యాప్తంగా పీఎస్బీలకు అనుబంధంగా ఈ పోలీస్ స్టేషన్లను చైనా (ఫ్యుజో పోలీస్) ఏర్పాటు చేసింది. కేవలం గ్రేటర్ టొరంటో (Canada) ప్రాంతంలోనే కనీసం మూడు స్టేషన్లు ఉన్నాయి. వీటితోపాటు ఈ చట్టవిరుద్ధమైన కేంద్రాల ద్వారా ఆయా దేశాల్లో జరిగే ఎన్నికల్లోనూ చైనా ప్రభుత్వం (China) ప్రభావితం చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 21 దేశాల్లో 30 స్టేషన్లను తెరిచింది. చైనా పోలీస్ స్టేషన్ల (China Police Stations) కోసం ఉక్రెయిన్, ఫ్రాన్స్,స్పెయిన్, జర్మనీతోపాటు యూకే దేశాల్లోనూ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది.
స్వదేశానికి తరలిస్తూ..
విదేశాల్లోని తమ పౌరులకు సహాయం చేసేందుకు ‘ఫ్యూజో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (PSB)’ పేరుతో ప్రపంచ దేశాల్లో చైనా ప్రభుత్వం పోలీస్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్తోపాటు ఇతర విషయాల్లో స్థానిక పోలీసులకు సహకరించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చైనా చెప్పుకుంటోంది. ఇదే సమయంలో ఏదైనా కేసుల్లో చిక్కుకునే చైనీయులను న్యాయం పేరుతో స్వదేశానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే రెండు లక్షలకు పైగా తమ పౌరులను సొంత దేశానికి తరలించినట్లు సేఫ్గార్డ్ డిఫెండర్స్ అనే నివేదిక వెల్లడించింది.
ఇలాంటి ప్రయత్నాలతో చైనా మానవ హక్కుల (Human rights) ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. భద్రతా కారణాలు చెప్పి ఇలా తీసుకువచ్చిన పౌరులను నిర్బంధ క్యాంపులకు తరలించడం, కుటుంబాల నుంచి వేరుచేయడం, వారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తుండడంపై చైనా అధికార కమ్యూనిస్టు పార్టీపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, ఇటువంటి వాటిని ‘వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు’గా (Vocational Training Centre) చెబుతోన్న చైనా.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచేందుకేనని చెప్పుకుంటోంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినవారిలో డిగ్రీ చేసినవారే అధికంగా ఉన్నారని 2019 చివరలో చైనా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM