China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
చైనాలో కరవు తీవ్రంగా ఉంది. చైనాలో హీట్ వేవ్ కారణంగా ప్రజలు అవస్థులు పడుతున్నారు. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద నదిలో నీటి నిల్వలు ఎన్నడూ లేనంత తక్కువగా ఉన్నాయి.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో తీవ్ర కరవు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనాలో కరవు తీవ్రంగా ఉంది. అక్కడ హీట్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద నదిలో నీటి నిల్వలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. మరోవైపు విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. హైడ్రోపవర్ ఉత్పత్తి సాధ్యం కాక.. ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలకు పూర్తిగా సెలవులు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలే కొవిడ్ లాక్డౌన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కరెంటు కోతలు గుదిబండలా మారాయి. దీంతో చైనా అధికారులు కృత్రిమ వర్షాలు కురిసేలా మేఘాలను ప్రేరేపించేందుకు యత్నాలు మొదలు పెట్టారు.
1961 తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు చూడలేదు..
చైనాలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ప్రభావం చూపుతున్నాయి. గత రెండు నెలల నుంచి రికార్డు స్థాయిలో వేడి నమోదవుతోంది. 1961 తర్వాత ఈ స్థాయిలో ఎండలు నమోదు కావడం ఇదే అని ‘ఎర్త్.ఓఆర్జీ’ కథనంలో పేర్కొంది. ఇదే పరిస్థితి కనీసం ఆగస్టు 26 వరకు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు.
యాంగ్జీ నదిలో నీటికి కటకట..
ఆసియాలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీలో నీటి మట్టం ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. గత రెండు నెలల నుంచి తీవ్రమైన ఎండల దెబ్బకు నది చాలా భాగం ఎండిపోయి దర్శనమిస్తోంది. దీనికి తోడు వర్షపాతం గత 60 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి పడిపోయిందని గ్లోబల్ టైమ్స్ కథనంలో పేర్కొంది. నైరుతీ చైనాలో సిచువాన్ ప్రావిన్స్పై కరవు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోని 51 చిన్న నదులు , 24 రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయినట్లు చైనా పత్రిక పేర్కొంది.
భారీగా కరెంటు కోతలు..
చైనాలోని మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన సిచువాన్ ఏడేళ్ల క్రితం నుంచి అత్యధికంగా హైడ్రోపవర్ పై ఆధారపడుతోంది. దీంతో ఇక్కడ 80శాతం ఈ విద్యుత్తునే వినియోగిస్తారు. ఇప్పుడు వర్షాభావం కారణంగా తీవ్ర కొరతను ఎదుర్కొంటుండటంతో ఈ ప్రావిన్స్లోని హైడ్రోపవర్ ప్లాంట్ల ఉత్పత్తి పడిపోయిందని సిచువాన్ ఎలక్ట్రిక్ పవర్ కంట్రోల్ సెంటర్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఝూజిన్ వెల్లడించారు. మరోవైపు చైనాలో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రిడ్ నుంచి విద్యుత్తు మళ్లింపు సాధ్యం కావడంలేదు. దాదాపు 54 లక్షల మంది జనాభా ఉన్న డైజూ నగరం కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కరెంటు కోతను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో సబ్వే స్టేషన్ల నిర్వహణ కోసం వీధిలైట్లను ఆపివేస్తున్నారు. దీంతోపాటు డైజూ నగరంలో కూడా పొదుపు చర్యలు చేపట్టారు. ఈ ప్రావిన్స్లోని ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, ఆఫీసులకు కరెంటును రేషన్ విధానంలో కేటాయిస్తున్నారు. విద్యత్తు ఎక్కువగా వినియోగించే ఫ్యాక్టరీలను తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఫలితంగా టొయోటా, ఫాక్స్కాన్, చైనా బ్యాటరీల తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంప్రెక్స్ టెక్నాలజీ సంస్థల కర్మాగారాలు నిలిచిపోయినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 26 సెంటీగ్రేడ్కు తక్కువలో వాడకూడదని నిబంధన విధించింది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రెడ్ అలర్ట్..
చైనాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే 138 నగరాల్లో అత్యధిక ప్రమాద హెచ్చరిక అయిన రెడ్ అలర్ట్ను ప్రకటించారు. తాజాగా బుధవారం మరో 373 నగరాల్లో ఆరెంజ్ అలర్ట్ (రెండో అతితీవ్ర ప్రమాద హెచ్చరిక)ను జారీ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ను ప్రకటించారు. గత సోమవారంతో హీట్వేవ్ మొదలై 64 రోజులు దాటింది. దీనిపై వాతావరణ శాఖ స్పందిస్తూ ఇది రికార్డు అని.. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరించింది. మొత్తం 262 వెదర్స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతుండగా.. మరో 8 చోట్ల 44 డిగ్రీలను దాటేసినట్లు పేర్కొంది.
యాంగ్జీ నదీపరీవాహక ప్రాంతంలో మేఘమథనంపై దృష్టి..
చైనా ఈ కరవును తట్టుకోవడానికి మేఘమథనంపై దృష్టిపెట్టింది. చైనా విమానాలు సిగరెట్ సైజ్లోని సిల్వర్ అయోడైడ్ రాడ్లను మేఘాల్లోకి వదులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1940 నుంచి క్లౌడ్ సీడింగ్ జరుగుతోంది. కాకపోతే చైనాలో ప్రస్తుతం భారీ ఎత్తున చేపడుతున్నారు. యాంగ్జీ పరీవాహక ప్రాంతంలో చాలాచోట్ల మేఘమథనం మొదలుపెట్టారు. మరోవైపు హుబే ప్రావిన్స్లో క్లౌడ్ సీడింగ్ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇక్కడ కూడా అర కోటి మంది కరవుతో ఇబ్బందులు పడుతున్నారు. 1,50,000 మందికి తాగునీటి కొరత ఉండగా.. 4,00,000 హెక్టార్ల పొలాలకు నీరు లేదు. ఈ సారైనా వరుణుడు కరుణించి డ్రాగన్ దాహం తీరుస్తాడేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా