Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్ల సమావేశం!
భారత సరిహద్దులో పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పు పొంచివున్న వేళ.. ఈ రెండు దేశాలూ అరుణాచల్ ప్రదేశ్కు అతిసమీపంలో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా నుంచి భారత్కు ముప్పు పొంచివున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత సరిహద్దుకు సమీపంలోనే చైనా (China) ఓ సమావేశానికి సిద్ధమైంది. టిబెట్లో నిర్వహిస్తోన్న 3వ ట్రాన్స్-హిమాలయ ఫోరం సమావేశానికి అటు పాకిస్థాన్ (Pakistan) కూడా హాజరుకానుంది. ఈ సమావేశం జరుగుతోన్న ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్కు (Arunachal Border) అతి సమీపంలో ఉండటం గమనార్హం.
ట్రాన్స్-హిమాలయ ఫోరం ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ సమావేశాలు అక్టోబర్ 4-5 తేదీల్లో జరగనున్నాయి. స్వయంప్రతిపత్తి గల టిబెట్లోని నియాంగ్చి ఈ భేటీకి వేదిక కానుంది. ఇది టిబెట్ రాజధాని లాసాకు 400కి.మీ దూరంలో ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాకు మాత్రం అతి సమీపంలో (సుమారు 150కి.మీ) ఉంటుంది. ఈ సమావేశానికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ కూడా హాజరుకానున్నట్లు అధికారంగా వెల్లడైంది. చైనా విదేశాంగ ఆహ్వానం మేరకు ఈ సమావేశాల్లో పాల్గొననున్నట్లు పాక్ విదేశాంగ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరితోపాటు మంగోలియా, అఫ్గానిస్థాన్ దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నారు.
IAF: డైనమిక్ కార్యాచరణతో.. LAC వెంట నిరంతర పర్యవేక్షణ
ప్రాంతీయ దేశాలు ఆచరణాత్మక సహకారాన్ని (Practical Cooperation) మరింత విస్తృత పరిచేందుకుగాను ట్రాన్స్-హిమాలయ ఫోరం 20018లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ, భౌగోళిక అనుసంధానం, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచుకునే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. 2019లో మరోసారి భేటీ అయ్యింది. తాజాగా మూడోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమైంది. ఇదిలాఉంటే, చైనాతో సంబంధాలు సరిగ్గా లేవని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవలే ఉద్ఘాటించడం.. ఆసియా క్రీడల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాలు ఇచ్చేందుకు చైనా నిరాకరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?