China: కోట్లమంది చైనీయుల ‘గ్రేట్ మైగ్రేషన్’.. అధ్యక్షుడి ఆందోళన
కొత్త సంవత్సరం వేళ.. చైనాలో కోట్ల మంది పౌరులు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండనుందనే విషయంపై చైనా అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.
కరోనా వైరస్ విలయంతో వణికిపోతోన్న చైనాను.. నూతన సంవత్సర వేడుకలు (Lunar New Year) మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లడం ఇందుకు కారణమవుతోంది. లూనార్ కొత్త సంవత్సరం సందర్భంగా వారంతా సొంతూళ్లకు వెళ్తుండటం(Great Migration)తో.. వైరస్ ఉద్ధృతిని గ్రామాలు తట్టుకుంటాయా? అనే ఆందోళన దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్లో మొదలైనట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
చైనాలో కొత్త సంవత్సరం వేడుకలను (Lunar New Year) జనవరి 21 నుంచి ఫిబ్రవరి నాలుగోవారం వరకు నిర్వహిస్తారు. ఈ 40 రోజుల సమయంలో భారీ సంఖ్యలో చైనీయులు తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఇప్పటికే బీజింగ్, షాంఘై వంటి మహా నగరాల్లో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నట్లు సమాచారం. అక్కడి ప్రయాణికుల వాహనాలు కూడా నగరాలు, గ్రామాల మధ్య 200 కోట్ల ట్రిప్పులు తిరుగుతాయని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 7వ తేదీ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 48 కోట్ల ప్రజలు స్థానికంగా ఆయా ప్రదేశాలకు ప్రయాణాలు చేసినట్లు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈ సారి ప్రయాణికుల సంఖ్య భారీగా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు గత మూడేళ్లుగా కొవిడ్ ఆంక్షల కారణంగా తమ సొంత గ్రామాలకు వెళ్లలేదని.. ఈసారి మాత్రం ఎలాగైనా ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతామని చైనీయులు మీడియాతో చెబుతున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కొందరు పీపీఈ కిట్లతో ప్రయాణించడం గమనార్హం.
ఇలా కొవిడ్ ఉద్ధృతిని చవిచూస్తోన్న నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం అక్కడి అధికారుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే విషయంపై అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఆందోళన చెందుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటివరకు కొవిడ్ కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు గ్రామాలకు తరలివెళ్లడం (Great Migration) వైరస్ మరోసారి ఉద్ధృతి చెందడానికి కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
మరోవైపు కొవిడ్ విజృంభణ కారణంగా చైనాలో నిత్యం వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే 60 వేల కొవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. ఇక చైనా కొత్త సంవత్సరం సెలవుల సమయంలో ప్రతిరోజు 36 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తుండటం అక్కడి అధికారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ