China: ఉద్యమకారులకు మానసిక చికిత్స.. చైనాలో మరో దారుణం..!
చైనా హక్కుల ఉద్యమకారులను ఘోరంగా అణచివేస్తోందని మాడ్రిడ్కు చెందిన ఎన్జీవో సేఫ్గార్డ్ డిఫెండర్స్ ఓ నివేదికలో పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులను చైనా ఘోరంగా అణచివేస్తోందని మాడ్రిడ్కు చెందిన ఎన్జీవో సేఫ్గార్డ్ డిఫెండర్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఉద్యమకారులను మానసిక చికిత్సాలయాల్లో బంధించడం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. అక్కడ డాక్టర్లు, వైద్యశాఖలోని అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తారని వివరించింది. ‘అంకాంగ్’( చైనాలో మానసిక చికిత్సాలయాలను పిలిచే పేరు)లను చైనా దశాబ్దాల తరబడి రాజకీయ ఖైదీలను శిక్షించేందుకు వాడుతోంది. 2010లో కొన్ని సంస్కరణలు చేసి మానసిక చికిత్సాలయాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోకి తెచ్చినా పెద్దగా మార్పులు రాలేదు.
చాలా వరకు డేటా బాధితులను, బాధిత కుటుంబాలను నేరుగా ఇంటర్వ్యూలు చేసి ఈ నివేదికలో సమాచారాన్ని సేకరించారు. చైనాకు చెందిన ఎన్జీవో సివిల్ రైట్స్ అండ్ లైవ్లీహుడ్ వాచ్ (సీఆర్ఎల్డబ్ల్యూ) ఈ ఇంటర్వ్యూలు చేసింది. 2015-21 మధ్యలో కనీసం 99 మంది ఉద్యమకారులను రాజకీయ కారణాలతో సైకోథెరిపిక్ సెంటర్లకు తరలించనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022లో కూడా తరచూ సీసీపీ రాజకీయ శత్రువులు సైకోథెరిపిక్ కేంద్రాల్లో దర్శనమిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యర్థులను అసలు న్యాయవ్యవస్థ వద్దకు కూడా వెళ్లనీయకుండా చేయడంలో సఫలమైందని సేఫ్గార్డ్ నివేదిక వివరించింది. మానసిక ఆరోగ్యం సరిగా లేదని వైద్య నివేదికలను సృష్టిస్తుందని వెల్లడించింది. చికిత్స తర్వాత కూడా వారు సమాజంలో ఏకాకులుగా మిగిలిపోతారని తెలిపింది. ఉద్యమకారులను బలవంతంగా ఆసుపత్రుల్లో చేర్చడంలో, చికిత్స చేయడంలో వైద్యశాలలు, డాక్టర్లు సీసీపీతో కుమ్మక్కై పనిచేస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ రాజకీయ ఖైదీలను కొట్టడం, విద్యుత్షాక్ థెరపీలు, ఒంటరిగా ఉంచడం వంటివి చేస్తారు. అధ్యక్షుడి చిత్రంపై రంగుపోయడం, సైన్యంలో గాయానికి పరిహారం కోరడం వంటివి చేసిన వారిని కూడా ఈ కేంద్రాలకు తరలించడం సీసీపీ క్రూరత్వాన్ని తెలియజేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని