Nancy pelosi: నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు..!

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకు ప్రతిగా ఆమెపై ఆంక్షలు విధిస్తన్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు.

Published : 05 Aug 2022 16:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది. 

గత 25 ఏళ్లలో తైవాన్‌ సందర్శించిన అతిపెద్ద అమెరికా నేత పెలోసీనే. తైవాన్‌ను తన అంతర్భాగంగా చైనా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. పెలోసీ పర్యటన చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కవ్వింపుగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో పెలోసీ, ఆమె కుటుంబంపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ.. టోక్యోలో విలేకరులతో మాట్లాడారు. ‘తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మమ్మల్ని అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం’’ అని పెలోసీ చెప్పుకొచ్చారు. మరో వైపు పెలోసీ పర్యటనకు నిరసనగా ఇప్పటికే చైనా తైవాన్‌ సమీపంలో భారీ ఎత్తున యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలను అమెరికా ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ వీటిని కవ్వింపు చర్యలుగా అభివర్ణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని