Winter Olympics: టార్చ్బేరర్ వివాదంపై స్పందించిన చైనా
టార్చ్బేరర్ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని పేర్కొంది.
అంతర్జాతీయ విమర్శలతో చైనా దిద్దుబాటు చర్యలు
బీజింగ్: బీజింగ్లో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్లో భాగంగా టార్చ్బేరర్గా గల్వాన్ ఘటనలో గాయపడిన సైనికుడిని చైనా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చైనా తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్తోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా చైనా తీరును తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో టార్చ్బేరర్ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని వాస్తవిక, హేతుబద్ధమైన రూపంలోనే చూడాలని పేర్కొంటూ తన నిర్ణయాన్ని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది.
కర్నల్ క్వీ ఫాబోవాను టార్చ్బేరర్గా నియమించడం దేశాల మధ్య వారధిగా నిలిచే ఒలింపిక్స్కు విరుద్ధంగా ఉందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ స్పందించారు. ‘బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించే టార్చ్ బేరర్ల ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగానే జరుగుతుందని స్పష్టం చేస్తున్నాను. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు హేతుబద్ధమైన కోణంలో చూస్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇది భారత్తో సున్నితమైన అంశమనే విషయాన్ని చైనా విస్మరించిందా అనే ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దంటూ ఝావో లిజియన్ అన్నారు.
గల్వాన్ లోయలో భారత్ సైనికులతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ పీఎల్ఏ కర్నల్ క్వీ ఫాబోవాను... వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలేరన్ నిమిత్తం టార్చ్బేరర్గా చైనా నియమించింది. దీనికి భారత్ దీటుగా స్పందించింది. ఇందుకు నిరసనగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు చైనా వింటర్ ఒలింపిక్స్ వేదికగా చేసుకుందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఇందుకు నిరసనగా ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనరని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. మరోవైపు ఈ విశ్వక్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలను దూరదర్శన్ ఛానల్ కూడా ప్రసారం చేయబోదని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ ఇప్పటికే పేర్కొన్నారు.
మరోవైపు చైనా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని అగ్రదేశం అమెరికా కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య సిగ్గుచేటు అంటూ చైనా తీరును తీవ్రంగా విమర్శించింది. ఓవైపు భారత్పై దాడికి దిగుతూనే వీగర్లపై మారణహోమానికి పాల్పడుతోన్న చైనా.. వారి సైనికులను బీజింగ్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎంచుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టింది. ఈ విషయంలో భారత్కు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. చైనా తీసుకున్న నిర్ణయంపై ఇలా అంతర్జాతీయంగా విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగశాఖ స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తోన్న రష్యా.. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. -
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను విదేశీ చేతుల్లో పెట్టారని ముయిజ్జు ఆరోపించారు. -
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల