Zero Covid policy: బాధ్యతగా మాట్లాడితే బెటర్.. WHOకు హితవు చెప్పిన డ్రాగన్ దేశం..!
తన కొవిడ్ జీరో వ్యూహంపై చైనా పునరాలోచించుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి చేసి వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది.
బీజింగ్: తన కొవిడ్ జీరో వ్యూహంపై చైనా పునరాలోచించుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ తరహా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికింది. ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తమ విధానాన్ని సమర్థించుకున్నారు.
‘సంబంధిత వ్యక్తులు కరోనా కట్టడికి చైనా అనుసరిస్తోన్న విధానంపై సహేతుకమైన అభిప్రాయం కలిగి ఉంటారని ఆశిస్తున్నాం. అలాగే వాస్తవాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని భావిస్తున్నాం’ అంటూ ఘాటుగా స్పందించారు. అలాగే కొవిడ్ జీరో విధానంపై ఆన్లైన్లో చర్చలు జరపకుండా, ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ వ్యాఖ్యలు కనిపించకుండా చేసేందుకు డ్రాగన్ దేశం చర్యలు తీసుకుంది. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో WHO,Tedros హ్యాష్ట్యాగ్తో శోధిస్తుంటే ఎలాంటి ఎలాంటి ఫలితాలు కనిపించడంలేదని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే ఐరాస అధికారిక సైట్లో ప్రచురితమైన ఈ కథనాన్ని వీచాట్ యాప్ యూజర్లు షేర్ చేయలేకపోతున్నారని పేర్కొంది.
అసలు టెడ్రోస్ ఏమన్నారంటే..?
నిరంతరం మార్పులకు లోనవుతోన్న కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానం సమర్థనీయమైంది కాదని ఇటీవల టెడ్రోస్ అన్నారు. ‘కరోనావైరస్ సరికొత్త మార్పులు సంతరించుకుంటూ..మరింత వ్యాప్తి చెందుతోంది. దానికి తగ్గట్టుగా మీ విధానంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం’ అంటూ కొవిడ్ జీరో విధానంపై పునరాలోచన చేసుకోవాలని చైనాకు సూచించారు. ఈ మాటలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268