China: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. యుద్ధానికి సిద్ధమంటోన్న తైపే
చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనను విజయవంతంగా ముగించడంపై డ్రాగన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నిన్న పెలోసీ తైవాన్లో ఉండగానే
బీజింగ్: చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనను విజయవంతంగా ముగించడంపై డ్రాగన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నిన్న పెలోసీ తైవాన్లో ఉండగానే ఆ ద్వీప దేశానికి సమీపంలో లైవ్ డ్రిల్ చేపట్టిన చైనా.. గురువారం దీవి చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాల నిర్వహణ మొదలుపెట్టింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ విన్యాసాల కోసం తైవాన్ చుట్టూ ఆరు కీలక ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అయితే తైవాన్కు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఈ డ్రిల్స్ జరగనున్నట్లు చైనా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి.. తైవాన్ జలాలు, గగనతలంలోకి తమ నౌకలు, విమానాలను పంపించట్లేదని డ్రాగన్ చెబుతోంది.
యుద్ధానికి కోరుకోవట్లేదు కానీ..
మరోవైపు తాజా కథనాలపై తైవాన్ రక్షణశాఖ స్పందించింది. చైనా మిలిటరీ విన్యాసాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపింది. యుద్ధం వంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామంది. అయితే, అలాంటి పరిస్థితులను తాము కోరుకోవట్లేదని తెలిపింది. ఘర్షణలను రెచ్చగొట్టి వివాదానికి కారణమవడం తమ విధానం కాదని స్పష్టం చేసింది.
కాగా.. చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్ మారీటైమ్, పోర్ట్ బ్యూరో నిన్న పలు నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్ డ్రిల్స్ జరుపుతోన్న మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. చైనా చర్యల కారణంగా 18 అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగిందని తైవాన్ కేబినెట్ మండిపడింది.
అయితే చైనా మాత్రం తమ డ్రిల్స్ను సమర్థించుకుంటోంది. పెలోసీ పర్యటనతో అమెరికా తమను రెచ్చగొట్టిందని, ఇక్కడ తామే బాధితులమని డ్రాగన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు తెలపడం గమనార్హం. అంతేగాక, చైనా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న అమెరికా చర్యకు అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు