Nancy Pelosi: పెలోసీ పర్యటిస్తే అమెరికాకు మూల్యం తప్పదు.. చైనా హెచ్చరిక
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన చైనా, యూఎస్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ పర్యటనలో భాగంగా పెలోసీ తైవాన్కు వెళ్లనున్నట్లు వస్తోన్న వార్తలే అందుకు కారణం.
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన చైనా, యూఎస్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ పర్యటనలో భాగంగా పెలోసీ తైవాన్కు వెళ్లనున్నట్లు వస్తోన్న వార్తలే అందుకు కారణం. ఈ వార్తలపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న డ్రాగన్.. తాజాగా అగ్రరాజ్యాన్ని గట్టిగా హెచ్చరించింది. పెలోసీ తైవాన్లో అడుగుపెడితే అమెరికా మూల్యం చెల్లించక తప్పదని చైనా గట్టిగా హెచ్చరించింది.
‘‘చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించేలా పెలోసీ వ్యవహరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించాలి. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తైవాన్ దేశాన్ని తమ భూభాగంగానే పరిగణిస్తోన్న చైనా.. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. పెలోసీ తైవాన్లో అడుగుపెడితే అది రెచ్చగొట్టే చర్యే అవుతుందని, అది చాలా ప్రమాదకరమని పేర్కొంది. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఈ విషయంపై గట్టిగానే హెచ్చరించారు.
తైవాన్ తీరంలో అమెరికా యుద్ధ నౌకలు..
చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ఆమె తైవాన్ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని తెలిపింది. అయితే పెలోసీ మాత్రం తైవాన్కు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె మలేసియాలో ఉన్నారు. ఈ రాత్రికి ఆమె తైపే నగరానికి చేరుకునే అవకాశాలున్నాయని పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
దీంతో అమెరికా అప్రమత్తమైంది. తైవాన్ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ క్యారియర్ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని సదరు కథనం పేర్కొంది. తైవాన్కు తూర్పువైపున ఈ యుద్ధ నౌకలు మోహరించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని