China: తగ్గని కరోనా.. ‘జీరో కొవిడ్’ విధానానికి చైనా స్వస్తి?
‘జీరో కొవిడ్’ విధానానికి ముగింపు పలకాలని యోచిస్తోంది చైనా. ఒక్క కరోనా కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్డౌన్ విధించిన చైనా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది......
డైనమిక్ జీరో కొవిడ్ పద్ధతికి శ్రీకారం!
బీజింగ్: చైనాను కరోనా గజగజా వణికిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అక్కడ వైరస్ ప్రబలుతోంది. రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు డ్రాగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘జీరో కొవిడ్’ విధానంతో ఇన్ని రోజులూ కొవిడ్ను కట్టడి చేస్తూ వచ్చిన డ్రాగన్.. ఆ పద్ధతికి ముగింపు పలకాలని యోచిస్తోంది. ఒక్క కరోనా కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్డౌన్ విధించిన చైనా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది. ఈ విషయాన్ని చైనీస్ పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. చైనా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా సమాధానాలు చెబుతోంది.
జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు చైనాలో తగ్గడం లేదు సరికదా ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం చేకూరుతోందని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. అందుకే జీరో కొవిడ్ విధానాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్లు వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటాయని చైనా వైద్యుడు జాన్ వెన్హాంగ్ అన్నారు. టీకాలు వైరస్ను బలహీన పరుస్తాయని తెలిపారు. చైనాలో కొవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని మరో వైద్యుడు యాన్జాంగ్ హాంగ్ అన్నారు. చైనాలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు వాడుతున్నారని తెలిపిన ఆయన.. అవి ఫైజర్ వ్యాక్సిన్లా సమర్థంగా పని చేయట్లేదని వెల్లడించారు.
వైరస్ కట్టడికి డ్రాగన్ కొత్త పద్ధతిని పాటించాలని చూస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దానిని ‘డైనమిక్ జీరో కొవిడ్ పద్ధతి’ అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. వైరస్ను వంద శాతం కట్టడి చేయడం సాధ్యం కాదన్న విషయం గ్రహించిన చైనా.. కేసులను తగ్గించేందుకు పూర్తిస్థాయి లాక్డౌన్లు కాకుండా వేరే మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణ లాక్డౌన్ల వల్ల.. ప్రజల ప్రాణాల్ని కొంత మేర డ్రాగన్ కాపాడినప్పటికీ.. అది ఆ దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే చైనా జీరో టాలరెన్స్ విధానాన్ని ఎత్తివేయాలని చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు