China: మళ్లీ లాక్డౌన్ యోచనలో చైనా? వద్దు బాబోయ్ అంటోన్న ప్రజలు!
చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CCDCP) విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనా(China)లో ఫ్లూ (Influenza) కేసులు పెరుగుతున్నాయట. దీంతో ఫ్లూ కేసులు నమోదవుతున్న నగరాల్లో లాక్డౌన్ (Lockdown) విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
బీజింగ్: చైనా (China)లో మరోసారి లాక్డౌన్ (Lockdown) విధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ (Covid 19) నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజలను ఫ్లూ (Influenza) రూపంలో మరో వైరస్ కలవరపెడుతుండటమే ఇందుకు కారణం. దీంతో ఫ్లూ కట్టడి చర్యల్లో భాగంగా చైనాలోని పలు నగరాల్లో లాక్డౌన్ విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, లాక్డౌన్ను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పటికే జియాన్ (Xi'an) నగరంలో ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో వ్యాపారాలు, పాఠశాలలతో పాటు జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని అక్కడ ప్రభుత్వం సూచించిందట. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారట. జియాన్ నగరం చైనాలోని పర్యాటక నగరాల్లో ఒకటి. గతంలో కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయామని, లాక్డౌన్కి బదులు అందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారట.
చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CCDCP) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో 25.1 శాతంగా ఉన్న ఫ్లూ కేసులు గత వారం 41.6 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో కొవిడ్-19 కేసులు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయని తెలిపింది. దీంతో ఫ్లూ కేసులు నమోదవుతున్న నగరాల్లో లాక్డౌన్ విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్నిఅక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇన్ఫ్లూయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్భూషణ్ హెచ్చరించారు. గత రెండు నెలల్లో ఒడిశాలో 59 హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదుకాగా.. హరియాణా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు. గుజరాత్లో హెచ్1ఎన్1 వైరస్తో ఒక వ్యక్తి మరణించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 79 ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి. మార్చి నెలాఖరు నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం