China: ఒమిక్రాన్ వేళ.. చైనా వ్యూహం పనిచేస్తుందా..?
యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ కలవరపెడుతోన్న వేళ.. కఠిన ఆంక్షలతో కూడిన ‘జీరో కొవిడ్’ వ్యూహంతో కరోనాపై ఎంతకాలం చైనా పోరాటం కొనసాగిస్తుందనే వాదన మొదలయ్యింది.
జీరో కొవిడ్ వ్యూహంతో కుస్తీపడుతోన్న డ్రాగన్
బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావత్ ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ పంపిణీ, కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు వైరస్తో కలిసి జీవించే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. కానీ, కొవిడ్-19కు పుట్టినిల్లైన చైనా మాత్రం.. జీరో కొవిడ్ (Zero Covid) వ్యూహానికే కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా కొవిడ్ కేసులు బయటపడుతోన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్న చైనా.. పదుల సంఖ్యలో కేసులు వచ్చినా లక్షల మందిని క్వారంటైన్లో ఉంచుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన లాక్డౌన్లు అమలు చేస్తోంది. ఇలాంటి ఆంక్షల నడుమ కొవిడ్ పరీక్ష ధ్రువపత్రం లేదన్న కారణంతో తీవ్ర నొప్పులతో వచ్చిన గర్భిణిని చైనా వైద్యులు అడ్డుకున్న సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ కలవరపెడుతోన్న వేళ.. కఠిన ఆంక్షలతో కూడిన ‘జీరో కొవిడ్’ వ్యూహంతో కరోనాపై ఎంతకాలం చైనా పోరాటం కొనసాగిస్తుందనే వాదన మొదలయ్యింది.
ఏమిటీ జీరో కొవిడ్..?
కొవిడ్ పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకువచ్చే వ్యూహాన్ని ఎంచుకున్న చైనా.. స్థానికంగా కొవిడ్-19 కేసు వెలుగు చూసిన వెంటనే భారీ సంఖ్యలో కొవిడ్ టెస్టులు నిర్వహించడం, ట్రాకింగ్ ద్వారా అనుమానితులను గుర్తించే ప్రక్రియను చేపడుతోంది. అవసరమైన చోట కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తోంది. అంతేకాకుండా కొవిడ్ అనుమానిత వ్యక్తులను ఇళ్లు, హోటల్ల నుంచి బయటకు రానీయకుండా అక్కడే నిర్బంధిస్తోంది. తాజాగా షియాన్ నగరంలో 150 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో 1.3కోట్ల జనాభా కలిగిన నగరం మొత్తాన్ని లాక్డౌన్ చేసింది. షేంగ్జువౌ నగరంలో 11 కేసులు నిర్ధారణ కావడంతో కోటి మందికి టెస్టులు నిర్వహించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఇలా ఒక్కకేసు నిర్ధారణనైనా లక్షల సంఖ్యలో టెస్టులు, నిర్బంధాలు, ప్రయాణ ఆంక్షలను చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఎంతవరకు పనిచేస్తుంది..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30కోట్ల మందికి వైరస్ సోకగా.. దాదాపు 55లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనే ఇప్పటివరకు 8లక్షల మంది చనిపోయారు. ముఖ్యంగా విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ ప్రభావంతో చాలా దేశాల్లో నిత్యం లక్షల సంఖ్యలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. కానీ, కొవిడ్-19 తొలిసారి వెలుగు చూసిన చైనాలో మాత్రం ఇప్పటివరకు కేవలం 5వేల మరణాలు చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కేవలం జీరో కొవిడ్ వ్యూహం వల్లే ఇది సాధ్యమైందని చైనా ప్రభుత్వం చెబుతోంది. స్థానికంగా ఒక్క కేసు కనిపించకుండా చేసే సామర్థ్యం తమకు లేదని.. అయినప్పటికీ ఏ ఒక్క కేసు వెలుగు చూసినా స్థానికంగా మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే సామర్థ్యం తమకు ఉందని చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
తీవ్ర ఇక్కట్లు అయినప్పటికీ..!
జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోన్న చైనా.. వైరస్ కట్టడి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుస లాక్డౌన్లు, కొవిడ్ ఆంక్షలతో స్థానిక ప్రజలకే కాకుండా సరిహద్దు దేశాల నుంచి వలస వచ్చిన కూలీలు కూడా నానా కష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు లాక్డౌన్ సమయంలో ఆహారం, నిత్యావసర వస్తువుల సరఫరా, వైద్య చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కఠిన ఆంక్షలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నతోద్యోగిని కొట్టి చంపడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా వరుసగా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా మూసివేయడం వంటివి ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ ఆంక్షలు సడలిస్తుందా..?
వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై చైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే విదేశీ రాకపోకలను అనుమతిస్తోంది. ఇలా కనీసం వచ్చే నెలలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ వరకు ఈ ఆంక్షలను కొనసాగించేందుకు చైనా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా వ్యూహంపై అక్కడి నిపుణుల నుంచి వ్యతిరేకత వచ్చింది. వైరస్తో కలిసి జీవించే వ్యూహంతోనే దేశాలు ముందుకు వెళ్లాలని చైనాలో ప్రముఖ ఆరోగ్యరంగ నిపుణుడు ఝాంగ్ వెన్హోంగ్ చెప్పడం చైనా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కు కారణమయ్యింది. అయితే, జీరో కొవిడ్ వ్యూహాన్ని నిరవధికంగా కొనసాగించడం కచ్చితంగా సాధ్యమేనని చైనా చూపించినట్లు హాంకాంగ్ ఎపిడమాలజిస్ట్ బెన్ కౌలింగ్ అభిప్రాయపడ్డారు.
ఆంక్షలు సడలిస్తే ఏమవుతుంది..?
అమెరికా, యూరప్ దేశాల మాదిరిగా కొవిడ్ ఆంక్షలను సడలిస్తే స్థానికంగా వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండవచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కావడం.. వైరస్ బారినపడే వారి సంఖ్య అధికంగా ఉండడం వైరస్ విజృంభణకు అవకాశంగా పేర్కొన్నారు. అదే జరిగితే చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగవచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్లను ఎదుర్కొనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి.. వందశాతం ప్రజలకు అందించడం ద్వారానే ఇటువంటి అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని హాంకాంగ్ యూనివర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా ఒమిక్రాన్ వంటి అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ.. అసలు చైనా వ్యూహం ఎంతకాలం పనిచేస్తుందే వాదన మొదలయ్యింది. కొవిడ్ను ఎదుర్కొనేందుకు వివిధ అస్త్రాలతో ప్రపంచదేశాలు ముందుకెళ్తుంటే.. చైనా మాత్రం జీరో కొవిడ్ వ్యూహాన్నే నమ్ముకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనా ఇందులో ఏ మేరకు సఫలీకృతమవుతుందో చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM