China: జననాల రేటు తగ్గుతోన్న వేళ.. పెరిగిన చైనీయుల ఆయుర్దాయం
జననాల రేటు (Birth Rate) తగ్గుదల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా (China)లో ప్రజల సగటు ఆయుర్దాయం (Life expectancy) రేటు మాత్రం క్రమంగా పెరుగుతోంది.
బీజింగ్: జననాల రేటు (Birth Rate) తగ్గుదల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా (China)లో ప్రజల సగటు ఆయుర్దాయం (Life expectancy) రేటు మాత్రం క్రమంగా పెరుగుతోంది. చైనీయుల సగటు జీవితకాలం 0.6ఏళ్లు పెరిగి 77.93 ఏళ్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం.. 2020 నాటికి చైనాలో 60ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి జనాభా 26.4కోట్లు. ఇది ఆ దేశ జనాభాలో 18.7శాతం.
చైనాలో ఆరోగ్య అక్ష్యరాస్యత రేటు 25.4శాతానికి పెరగడంతోపాటు శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారి సంఖ్య 37.2శాతానికి పెరిగిందని నేషనల్ హెల్త్ కమిషన్లోని ప్రణాళికా విభాగం డైరెక్టర్ మావో క్వున్ ఆన్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఫిట్నెస్ కేంద్రాల (Fitness Centres) కోసం ఏటా దాదాపు ఒక బిలియన్ యువాన్లు (149 అమెరికన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు అక్కడి క్రీడా విభాగం అధికారి గవో యువాన్యీ వెల్లడించారు. మరోవైపు ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే టిబెట్లో (Tibet) 1951 గణాంకాల ప్రకారం అక్కడి ప్రజల ఆయుర్దాయం 35.5ఏళ్లుగా ఉండగా.. అది 72.19 (గతేడాది నాటికి) ఏళ్లకు చేరుకుందని చైనా అధికారిక మీడియా పేర్కొంది.
ఇదిలాఉంటే, చైనాలో గత కొన్నేళ్లుగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడం.. ఇదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇది గ్రహించిన ప్రభుత్వం.. ఎన్నో ఏళ్లుగా పాటించిన ఒక్కరు ముద్దు అన్న నినాదాన్ని పక్కనబెట్టి, ఇద్దరు పిల్లలు కనవచ్చని 2016లో ప్రకటించింది. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఇటీవల మరోసారి సవరించి మూడో బిడ్డను కూడా కనేందుకు వీలు కల్పించింది. ఇలాంటి దంపతులకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ చైనా జనాభాలో వృద్ధి మాత్రం కనిపించడం లేదు. జీవన వ్యయం పెరిగి పిల్లలను పెంచడం కష్టం కావడం, చిన్న కుటుంబాలకు అలవాటుపడిన చైనీయులు ఉన్నట్టుండి పెద్ద కుటుంబాలకు మారేందుకు ఇష్టపడకపోవడం, స్త్రీలు పెళ్లిని వాయిదా వేసుకోవడం, కరోనా వల్ల జననాలను వాయిదా వేసుకోవడం వంటివి పలు కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!